పైరసీ సీడిలను చూసి నిఖిల్ ఏం చేశాడో తెలుసా..!

పైరసీ సీడిలను చూసి నిఖిల్ ఏం చేశాడో తెలుసా..!
x
నిఖిల్ సిద్దార్థ
Highlights

నిఖిల్ సిద్దార్థ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం.

నిఖిల్ సిద్దార్థ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం అర్జున్ సురవరం. టీఎన్ సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబర్ 20న విడుదలైన ఈ పాజిటివ్ టాక్ తెచ్చుకొంది. విభిన్న చిత్రాలు చేస్తూ తెలుగు సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరైయ్యారు. ఈ తరుణంలో నిఖిల్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులలో ఎదో ఒక పాయింట్ ఉంటుంది అన్న ఎగ్జైట్ ని క్రియేట్ చేస్తూ వస్తున్నారు. విడుదలైన అన్ని చోట్లు మంచి కలెక్షన్లతో దూసుకెపోతుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియోటర్లను వెళ్లి ప్రేక్షకులతో చిత్ర యునిట్ మమేకమవుతోంది. అందులో భాగంగా గుంటూరు వెళ్లిన హీర్ నిఖిల్ కు రోడ్డు పక్కన పైరసీ సీడిల బండి కనిపించింది. అన్ని కొత్త సినిమాలకు సంబంధించిన సినిమాలు అమ్మడం చూసిన నిఖిల్ షాక్‌కి గురైయ్యారు. దీంతో కారు దిగి పైరసీ డీవీడీ అమ్ముతున్న మహిళను ప్రశ్నించారు.

ఎంతో కష్టపడి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్నాం. 40 రూపాయిలకే రోడ్డుపై అమ్ముతారా అని నిలదీశారు. దీంతో ఆ మహిళ తన కుటుంబ పోషణ కోసం సీడీలు అమ్ముతున్నామని, అంతే తప్ప తనకు ఏం తెలిదని చెప్పింది. ఈ ఘనటకు సంబందించిన ఓ విడీయోను నిఖిల్ తన వ్యక్తిగత ట్విటర్ లో పోస్టు చేశారు. దీనిపై నిఖిల్ అభిమానునలు స్పందింస్తున్నారు. నెటిజన్లు పైరసీని బ్యాన్ చేయాలని, సినిమాను థియేటరకు వెళ్లి చూడాలని పిలుపునిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories