ప్రభాస్ సినిమాని ఏకంగా సంవత్సరం వాయిదా వేసేసారు

film has been postponed for a year
x

 ప్రభాస్ సినిమాని ఏకంగా సంవత్సరం వాయిదా వేసేసారు

Highlights

* తాజా సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు ఇప్పుడు సినిమాని 2024 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది

Adi Purush: ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ఆదిపురుష్" సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. వెండితెరపై ప్రభాస్ ను శ్రీరాముడి పాత్రలో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మధ్యనే విడుదలైన చిత్ర టీజర్ ప్రేక్షకుల అంచనాల మీద నీళ్లు చల్లినట్లు అయింది. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం బాగోలేదంటూ అభిమానులు సైతం చిత్ర బృందం పై మండిపడటం మొదలుపెట్టారు. ఇంత భారీ బడ్జెట్ పెట్టి మరీ సినిమాకి అందించిన విజువల్ ఎఫెక్ట్స్ కంటే కార్టూన్ లో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ బావుంటాయి అంటూ చాలామంది విమర్శల వర్షం కురిపించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం టీజర్ కి వచ్చిన నెగిటివ్ రెస్పాన్స్ కారణంగా సినిమా విడుదల వాయిదా మరింత వాయిదా పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి భారీ అంచనాల మధ్య "ఆది పురుష్" సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో విడుదల కావాల్సింది. కానీ తాజా సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు ఇప్పుడు సినిమాని 2024 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 థియేటర్లలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో "ఆది పురుష్" సినిమా కంటే "సలార్" సినిమా ముందుగా విడుదల కాబోతోంది. మరి సంవత్సరం పాటు సినిమాని వాయిదా వేసాకైనా చిత్ర బృందం మంచి ఔట్పుట్ తో వస్తుందో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories