Pushpa 3: పుష్ప సీక్వెల్ కాదు ఫ్రాంచైజ్.. బంగారు బాతును పట్టేసిన మైత్రీ మూవీ మేకర్స్?

Director Sukumar Is Making Plans For Pushpa 3
x

Pushpa 3: పుష్ప సీక్వెల్ కాదు ఫ్రాంచైజ్.. బంగారు బాతును పట్టేసిన మైత్రీ మూవీ మేకర్స్?

Highlights

* ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే "పుష్ప" కి మరికొన్ని సీక్వెల్స్ కూడా పెట్టి ఒక ఫ్రాంచైస్ లాగా చేయాలని ప్లాన్ కూడా ఉందట.

Pushpa Movie: స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన "పుష్ప: ది రైజ్" బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళం లో స్టార్ నటుడైన ఫాహద్ ఫాసిల్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా "పుష్ప" కి మరొక సీక్వెల్ కూడా ఉండబోతుందని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో "పుష్ప" కి నిజంగానే మరికొన్ని సీక్వెల్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే "పుష్ప: 3" కి సంబంధించిన కథను రాయటం మొదలు పెట్టేసారట. "పుష్ప 2" కూడా పుష్ప కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయితే సుకుమార్ "పుష్ప 3" ని మొదలు పెడతారట.

ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే "పుష్ప" కి మరికొన్ని సీక్వెల్స్ కూడా పెట్టి ఒక ఫ్రాంచైస్ లాగా చేయాలని ప్లాన్ కూడా ఉందట. ఏదేమైనా సినిమాను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ కు పుష్ప ఒక బంగారు బాతులా మారిందని కొందరు చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories