30 ఏళ్ల తర్వాత మళ్ళీ నటిస్తున్న అలనాటి నటి జమున

30 ఏళ్ల తర్వాత మళ్ళీ నటిస్తున్న అలనాటి నటి జమున
x
Highlights

అలనాటి నటి జమున మళ్ళీ వెండితెర మీద మెరవనున్నారు. దేవినేని సినిమాతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మాజీ దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా...

అలనాటి నటి జమున మళ్ళీ వెండితెర మీద మెరవనున్నారు. దేవినేని సినిమాతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మాజీ దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న దేవినేని సినిమాలో జమున నటించనున్నారు. ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్‌.టి.ఆర్‌ ఫిలింస్‌ పతాకంపై రాము రాథోడ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం నిన్న(బుధవారం) హైదరాబాద్ లో జరిగింది.

పూజా కార్యక్రమాల్లో నటి జమున పాల్గొన్నారు. జమున కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత సి.కళ్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు ఫస్ట్‌ షాట్‌కి దర్శకత్వం వహించారు. ఈ సందర్బంగా జమున మాట్లాడుతూ.. 'నేను సినిమారంగం నుంచి తప్పుకుని 30 ఏళ్లు అయింది. రిటైర్‌ అయిన నన్ను మళ్లీ కెమెరా ముందు నిలబెట్టి సినిమా రంగులు వేసి నటించేలా చేశారు శివనాగు. ఈ సినిమాతోపాటుగా అన్నపూర్ణమ్మగారి సినిమాలో నేను ఒక రాణి పాత్ర చేస్తున్నాను' అని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories