'పరుగు పరుగు' తీయనున్న మెగా హీరో

పరుగు పరుగు తీయనున్న మెగా హీరో
x
Highlights

వరుస డిజాస్టర్ లతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా దెబ్బ తినింది అని చెప్పుకోవచ్చు. 'తేజ్ ఈ లవ్ యు' సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న...

వరుస డిజాస్టర్ లతో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా దెబ్బ తినింది అని చెప్పుకోవచ్చు. 'తేజ్ ఈ లవ్ యు' సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న తేజు ఇప్పుడు 'చిత్రలహరి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో త్వరలో మన ముందుకి రాబోతున్నాడం తన ఆశలన్నీ ఈ చిత్రంపైనే పెట్టుకున్నాడు ఈ మెగా హీరో. నివేత పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న విడుదల కాబోతోంది. ఇంకా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రోమోషన్ల జోరు మొదలు పెట్టింది చిత్రబృందం.

ఈ నేపథ్యంలో ఈ మధ్యనే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. కేవలం నిమిషం నిడివి ఉన్న ఆ టీజర్ వీడియో ఎంటర్టైనింగ్ గా ఉండడంతో సినిమా కూడా అలానే ఉండబోతోంది అని అర్థమైపోతోంది. ఇక రేపు ఈ సినిమాలోని 'పరుగు పరుగు' అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ పాట రేపు సాయంత్రం 5 గంటలకు ఇంటర్నెట్ లో విడుదల కానుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్ తో అలరించిన తేజ్ పాటతో ఎంతవరకు మెప్పిస్తాడో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories