చిరంజీవి, బాలకృష్ణ మాటా మంతి.. దేని గురించి?

చిరంజీవి, బాలకృష్ణ మాటా మంతి.. దేని గురించి?
x
చిరంజీవి, బాలకృష్ణ చర్చలు.. దేని గురించి?
Highlights

టాలీవుడ్ అగ్రకథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహాం నందమూరి బాలకృష్ణ వీరిద్దరు కలిసేది చాలా అరుదు.

టాలీవుడ్ అగ్రకథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహాం నందమూరి బాలకృష్ణ వీరిద్దరు కలిసేది చాలా అరుదు. కాగా.. వీరు సంభాషిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సినిమాల మధ్య గట్టి పోటీనే ఉంటుంది. నందమూరి, మెగా అభిమానుల మధ్య సినిమావార్ ఎప్పుడు ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పదేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఒకరిని ఒకరు కలుసుకోవడం, మాట్లాడడం కాస్త తగ్గింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలను ఇద్దరు చాలాల సార్లు ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు అక్కడి వరకే పరిమితమని, చిరంజీవి తనకు క్లోజ్ ఫ్రెండ్ అని బాలకృష్ణ అనేక సార్లు చెప్పారు. అలాగే చిరంజీవి కూడా బాలకృష్ణ మంచి మిత్రుడని వెల్లడించారు. ఎవరి పనులతో వాళ్లు బిజీగా గడపడంతో వల్ల పెద్దగా కలిసిన సందర్భాలు అరుదుగా ఉంటాయి. ‎తాజాగా కోడి రామకృష్ణ చిన్న కూతురు ప్రవల్లిక వివాహ వేడుకలో చిరంజీవి, బాలకృష్ణ కలుసుకున్నారు. ఇద్దరు కలిసి కూర్చొని ఏవో మాట్లాడుతున్నారు. ఈ ఫొటోల్లో ఇద్దరూ సీరియస్‌గా మాట్లుడుకుంటున్నారు. వీరిద్దరి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా.. దివంగత దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణ చిన్న కుమార్తె ప్రవల్లికకు మహేశ్‌తో వివాహం బుధవారం రాత్రి జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా వివాహానికి హాజరయ్యారు. కోడి రామకృష్ణతో ఉన్న అనుబంధంతో ఈ వివాహానికి వీరు హాజరైయ్యారు.

ఇక బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతుంది. విర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారని సమచారం. మణిశర్మ బాణీలు సమకూర్చనున్నారు. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆగస్ట్ 22న చిరు పుట్టిన రోజు కానుకగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories