వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి : ప్రియాంక రెడ్డి హత్యపై అనుష్క

వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి : ప్రియాంక రెడ్డి హత్యపై అనుష్క
x
Highlights

ప్రియాంక రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. దీనికి కారుకులైన నలుగురు నిందితులను నడిరోడ్డుపై

ప్రియాంక రెడ్డి హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. దీనికి కారుకులైన నలుగురు నిందితులను నడిరోడ్డుపై దారుణంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రియంకా రెడ్డి కుటుంబానికి ఆ దేవుడు దైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు.

ఇక దీనిపైన సినీ నటులు కూడా స్పందిస్తున్నారు. నటి అనుష్క శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఈ ఘటనపై ఘాటుగానే స్పందించారు. ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్యచేసిన క్రిమినల్స్ ని చూసి క్రూర మృగాలు కూడా సిగ్గుపడతాయని పోస్ట్ పెట్టారు అనుష్క.. అంతేకాకుండా మన సమాజంలో మహిళగా పుట్టడం నేరమా అని ప్రశ్నించారు. నిందుతులకి శిక్ష పడేంత వరకు మనం పోరాటం చేద్దామని, ప్రియాంకా రెడ్డి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు అనుష్క..

అలాగే RX 100 ఫేం కార్తికేయ కూడా ఈ ఘటన పైన స్పందించాడు. తానూ నటించిన గుణ 369లో ఓ అమ్మాయిపై చేయి వేసినందుకు నలుగురు యువకులను దారుణంగా చంపేస్తాడు హీరో కార్తికేయ.. అలా చంపడం నటించినందుకే నేను నాలుగు రోజులు చాలా డిస్టర్బింగ్‌గా ఉండేదని, ఇలా నిజంగా ఎలా చంపేస్తున్నారని ట్విట్టర్ వేదికగా స్పందించాడు కార్తికేయ..


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

#RIPPriyankaReddy 😥

Anushka Shetty (@anushkashettyofficial) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories