జేజమ్మ రేటు పెంచేసిందా ?

జేజమ్మ రేటు పెంచేసిందా ?
x
Highlights

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు... నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది అనుష్క.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు...

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో అనుష్క ఒకరు... నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది అనుష్క.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరియర్ ని నెట్టుకొచ్చింది. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో అనుష్క గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత లేడి ఓరియెంటడ్ సినిమాలు తీయాలంటే దర్శక నిర్మాతలకి అనుష్క బెస్ట్ ఆప్షన్ గా మిగిలిపోయింది.

అందులో భాగంగానే రుద్రమదేవి, బాహుబలి లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అనుష్క తెలుగు సినిమాలో నటించి చాలా రోజులు అయింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క మళ్ళీ నిశబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో అనుష్క ఓ మూగ అమ్మాయిగా నటించింది. అయితే ఈ సినిమాలోని పాత్ర కోసం అనుష్క 3.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

నిశబ్దం సినిమాలో అనుష్కతో పాటు మాధవన్,అంజలి, షాలిని పాండే, నాజర్,సుబ్బరాజు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories