అల్లుఅర్జున్ ఖాతాలో రికార్డు వసూళ్లు.. మహేశ్ లెక్క ఏంటి

అల్లుఅర్జున్ ఖాతాలో రికార్డు వసూళ్లు.. మహేశ్ లెక్క ఏంటి
x
మహేశ్ బాబు, అల్లుఅర్జున్,
Highlights

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఆగ్రకథనాయకుల చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఆగ్రకథనాయకుల చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు`.. స్టైలిస్ స్టార్ అల్లుఅర్జున్ `అల వైకుంఠపురములో..`, సినిమాలు ఒక రోజు గ్యాప్‌తో విడుదలై కలెక్షన్లు రాబట్టడంతో పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాలకు చెందిన యూనిట్‌లు విడుదల చేసిన కలెక్షన్లు అభిమానుల మధ్య వార్ కారణమవుతున్నాయి. రెండు సినిమాలకు చెందిన వారు నాన్‌ బాహుబలి రికార్డ్‌ అంటూ విడుదల చేసిన పోస్టర్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు విషయంలో మహేష్ బాబు సినిమా కంటే అల్లుఅర్జున్ సినిమా వసూళ్లు ముందున్నట్లు చూపిస్తున్నాయి.

అయితే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఒక రోజు ముందుగానే బరిలోకి దిగాడు. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయినా ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ టాక్ సాధించడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. 12 రోజుల్లో రెండు వందల కోట్ల గ్రాస్‌ సాధించిన చిత్రం మహేశ్ బాబు కెరీర్ లో ఆల్ టైం వసూళ్లు రాబట్టిందని సినిమా యూనిట్ తెలిపింది.

జనవరి 12న విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో..` సినిమా పది రోజుల్లో 220 కోట్ల గ్రాస్ చిత్రబృందం తెలిపింది. అంటే `అల వైకుంఠపురములో..` చిత్రం దాదాపు 145 కోట్ల షేర్‌ రాబట్టిందని తెలుస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చేసింది. దీంతో `అల వైకుంఠపురములో..` రికార్డ్ వసూళ్లు సాధిస్తూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories