అజయ్ దేవగణ్‌కు స్వాగతం పలికిన ఎన్టీఆర్

అజయ్ దేవగణ్‌కు స్వాగతం పలికిన ఎన్టీఆర్
x
Highlights

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ సినిమా కోసం యావత్ సినీ పరిశ్రమ...

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ సినిమా కోసం యావత్ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదల కోసం అవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి పోస్టర్ విడుదల చేయలేదు. ప్రెస్ మీట్ లు పెట్టలేదు. కాగా.. గణతంత్ర దినోత్సవం రోజున ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆర్ఆర్ఆర్ సెట్ లో జెండా అవిష‌్కరించి ఆ ఫోటోను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ ఈ చిత్రానికి సంబంధించిన విశేషలు పంచుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళితో కలిసి దిగిన పోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్విట్టర్లో ఈ ఫోటో పెట్టిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రపంచంలోకి స్వాగతం అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇక రాంచరణ్ దీనికి సంబంధించిన ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ సెట్స్ లోకి స్వాగతం, మీతో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. మీ వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్ అంటూ ఇన్ స్టాలో రాంచరణ్ ఫోటో పెట్టారు.

ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రాంచరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా హాలీవుడ్ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని జూలై 30న భారీ అంచనాల నడుమ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్యపాత్రాలలో కనిపించనున్నారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories