ఉపేంద్ర ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం

ఉపేంద్ర ట్వీట్‌పై నెటిజన్ల ఆగ్రహం
x
ఉపేంద్ర
Highlights

దిశపై అత్యాచారం చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

దిశపై అత్యాచారం చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై చాలా మంది ప్రముఖులు స్పందించారు. నిందితులను తగిన శిక్ష పడిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు కొందరూ వేధావులు న్యాయకోవిదులు ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకించారు. అయితే తాజాగా దీని ప్రముఖ నటుడు, యూపీపీ రాష్ట్రాధ్యక్షుడు ఉపేంద్ర చేసిన ట్వీట్ పెద్ద దుమారం చెలరేగింది.

ఈ ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర పోస్ట్‌పై కొందరు నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఉపేంద్ర ట్విటర్లో కోర్టులో విచారణ ముగిసిపోకముందే వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం సరికాదన్నారు. నలుగురే దిశపై అత్యాచారం చేసిన చంపారా? అని ప్రశ్నించారు. పెద్దవాళ్ల విషయంలో ఎన్‌కౌంటర్‌లు జరగడం లేదని ప్రశ్నించారు. నిజాయితీ పరులైనా అధికారలు దృష్టిపెడితే ఎన్‌కౌంటర్‌లతో మహిళలు చిన్నారులపై దాడులు ఆపోచ్చని పేర్కొన్నారు.

కానీ, ప్రముఖులు దుర్వినియోగం చేయకుండా ఉండాల్సిందని, ఎన్‌కౌంటర్ ద్వారా రౌడీయిజం తగ్గుతుందని ట్విట్ చేశారు. కాగా.. ఉపేంద్ర ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతుంటే మరి కొందరూ నెటిజన్లు సమర్ధిస్తున్నారు. ప్రముఖులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని నెటిజన్లు తమ అభిప్రాయం వెల్లడిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories