పూజా హేగ్దే కోసం 5 రోజులు ఫుట్ పాత్ పైనే

పూజా హేగ్దే కోసం 5 రోజులు ఫుట్ పాత్ పైనే
x
Highlights

సినీ తారలపైన ఫ్యాన్స్ అభిమానం వెలకట్టలేనిది. అభిమాన తారలను కలుసుకోవడం, వారితో సేల్ఫీలు దిగడం, వారితో చిట్ చాట్ చేయడం

సినీ తారలపైన ఫ్యాన్స్ అభిమానం వెలకట్టలేనిది. అభిమాన తారలను కలుసుకోవడం, వారితో సేల్ఫీలు దిగడం, వారితో చిట్ చాట్ చేయడం వారకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఒక్కోసారి ఈ అభిమానం ఫీక్ స్టేజ్ లోకి వెళ్ళిన సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణగా ఈ సంఘటనని చెప్పుకోవచ్చు.

ముంబైలో భాస్కర్ రావు పూజా హేగ్దేకి వీరాభిమాని ఆమెను ఎలాగైనా కలవాలని ఆమె కోసం ఏకంగా ముంబైకి వచ్చాడు. ఆమెను కలిసి వెళ్ళాలని ఏకంగా ఐదు రోజులు రోడ్డుపైనే పడుకున్నాడు. అయితే ఈ విషయాన్నీ తెలుసుకున్న పూజా భాస్కర్ రావు దగ్గరికి వెళ్లి కలిసింది. దీనికి సంబంధించిన వీడియోను పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. " భాస్కర్ రావు నన్ను కలిసేందుకు ముంబై వచ్చి 5 రోజుల పాటు వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ విషయం నిజంగా నన్ను కదిలించింది, కానీ నా అభిమానులు నా కోసం ఇలా చేయడం, ఇంతలా ఇబ్బంది పడటం నాకు ఇష్టముండదు. మీరు ఎక్కడున్నా సరే మీ ప్రేమను అభిమానాన్ని నేను పొందుతూనే ఉంటాను. మీరే నా బలం. లవ్ యూ ఆల్ '' అని పూజా హేగ్దే పేర్కొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన పూజా హేగ్దే విభిన్నమైన చిత్రాలలో, స్టార్ హీరోలతో నటించి మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా ఆమె అల.. వైకుంఠపురములో అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో అమూల్య అనే పాత్రలో, అల్లు అర్జున్ కి బాస్ గా కనిపించింది పూజా.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాబడుతుంది. ఇక పూజా హేగ్దే ప్రస్తుతం అక్కినేని అఖిల్, ప్రభాస్ చిత్రాలలో నటిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories