అభిమానులు గర్వపడేలా ఉంటుంది.. విజయవాడలో మహేష్ సందడి

అభిమానులు గర్వపడేలా ఉంటుంది.. విజయవాడలో మహేష్ సందడి
x
Highlights

"సరిలేరు నీకెవ్వరు" అభిమానులు గర్వపడేలా చిత్రం ఉంటుందని సినీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు .

"సరిలేరు నీకెవ్వరు" సినిమా అభిమానులు గర్వపడేలా ఉంటుందని సినీనటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు . విజయవాడలో సందడి చేశారు.విజయవాడలో నూతనంగా ఎర్పాటు చేసిన ఓ జ్యువెలరి షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ... ఏపీలో తొలి షో రూంను ఏర్పాటుచేసినందుకు సంస్థవారికి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని సినిమాల 100 రోజుల వేడుకలను విజయవాడలోనే జరిగాయని అన్నారు. విజయవాడ రావడం తనకు సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలపారు. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోందని తెలిపారు. అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుందన్నారు. కాగా, మహేష్ బాబు రాక గురించి తెలియడంతో ఆయన్ని చూసేందుకు అభిమానులతో భారీగా తరలివచ్చారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories