Live Blog: ఈరోజు (మే-27-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బుధవారం, 27 మే, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పంచమి (రేపు 12:32 am వరకు), తదుపరి షష్టి.సూర్యోదయం 5:45 am, సూర్యాస్తమయం 6:41 pm

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేడిగానే ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలే ఉన్నాయి. వేడిగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో బయట తిరిగే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈరోజు తాజా వార్తలు



Show Full Article

Live Updates

  • 27 May 2020 2:22 AM GMT

    స్కూల్స్ తెరవడానికి కేంద్రం అనుమతించలేదు

    - దేశంలో పాఠశాలలు, కళాశా లలు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు ఇంకా అనుమతి ఇవ్వలేదని కేంద్ర హోం శాఖ తెలిపింది.

    - వీటిని ఎప్పటి నుంచి తెర వాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేసింది.

    - పా ఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారంటూ వదం తులు వస్తున్న నేపథ్యంలో హోం శాఖ అధి కార ప్రతినిధి మంగళవారం రాత్రి ఆ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించా రు.


  • 27 May 2020 2:19 AM GMT

    రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన రద్దు

    నిర్మల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి నిర్మల్ పర్యటన రద్దు.

    * లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదంటూ హైదరాబాద్ లో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

    * మే 31 వరకు నిర్మల్ జిల్లాలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఇతర ప్రాంత నాయకులు రావద్దంటూ నోటీసులు జారీ చేసిన పోలీసులు.

    * మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్న కాంగ్రెస్ నాయకులు.



     



  • 27 May 2020 2:15 AM GMT

    తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట ఆర్.టి.ఏ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం.

    - బొలెరో వాహనాన్ని డీ కొన్న బైక్

    - ఒకరు మృతి

    - ఇద్దరికి తీవ్ర గాయాలు

    - క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలింపు

  • 27 May 2020 1:53 AM GMT

    కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవ రాజపురం వద్ద ప్రమాదం .

    - సైకిల్ ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.

    - వ్యక్తి మృతి

    - కడప జిల్లా రాజుపాలెం మండలంకు చెందిన వల్లి గా గుర్తింపు.

  • 27 May 2020 1:15 AM GMT

    ఇండియా పై జపాన్ ట్రావెల్ బ్యాన్

    - భారత్ లో కరోనా ఉధృతి పెరిగిపోతుండడంతో అంతర్జాతీయంగా సమస్యలు మోఅలయ్యాయి.

    - జపాన్ భారత దేశంపై ట్రావెల్ బ్యాన్ విధించింది.

    - ఇండియా తో పాటు మరో పది దేశాలపైనా ఈ బ్యాన్ విధించింది.

    - ఈ బ్యాన్ తో ఆయాదేశాల నుంచి ఎవరినీ తమ దేశంలోకి అడుగు పెట్టనీయకుండా చర్యలు తీసుకుంటోంది జపాన్ 

    - ఇప్పటికే జపాన్ 101 దేశాలపై నిషేధాన్ని విధించింది. తాజా నిష్దాలతో కలిపి మొత్తం 111 దేశాల వారిపై ఈ ట్రావెల్ బ్యాన్ విధించినట్టు అయింది.





Print Article
More On
Next Story
More Stories