Live Updates:ఈరోజు (జూన్-29) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు సోమవారం, 29 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, నవమి (రా.10:12 వరకు), హస్త నక్షత్రం (ఉ.07:14 వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • 29 Jun 2020 2:17 PM GMT

    - మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిదిలోని ఇంటర్ విద్యార్థినిలు మిస్సింగ్

    - బిజేఆర్ నగర్ కు చెందిన గ్లోరియా (19) సంవత్సరాలు ఇంటినుండి చెప్పకుండా వెళ్లిపోయినట్లు

    - గ్లోరియా తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు .

    - మౌలాలి షఫీ నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని నవనీత (18) యువతి ఇంటి నుండి తల్లితండ్రులకు చెప్పకుండా వెళ్లిపోయినట్లు నవనీత తల్లిదండ్రులు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు

    - రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలుసులు

  • 29 Jun 2020 2:16 PM GMT

    - హైదరాబాద్ లాక్ డౌన్ తో తెలంగాణ లో జరగాల్సిన ఎంట్రన్స్ పరీక్షలపై ప్రభావం

    - ఎంసెట్, ఈసెట్, పీజీ సెట్ లు వాయిదా పడే అవకాశం

    - గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 80 శాతం పరీక్షా కేంద్రాలు

    - జులై ఒకటి నుంచి 20 వరకు వివిధ ఎంట్రన్స్ లు

    - ఉన్నత విద్యా మండలి , వివిధ యూనివర్సిటీ ల అధికారులతో జరుగుతున్న కీలక సమావేశం

  • 29 Jun 2020 2:14 PM GMT

    కరీంనగర్ పోలీస్ రేంజ్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్

    _ కరీంనగర్ రేంజ్ పరిధిలోని రాజన్న సిరిసిల్ల జిల్లా, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల కు చెందిన ఇద్దరు ఎస్ఐలు సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కరీంనగర్ రేంజ్ ఇంఛార్జి డీఐజీ పి ప్రమోద్ కుమార్ ...

    - రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో పనిచేసిన ఎల్ ప్రవీణ్ కేసును నమోదు చేయడంలో ఆలస్యం చేయడం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలం కావడం కారణాలతో సస్పెన్షన్

    - కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎస్ఐ ఎన్ వెంకటేష్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కలప ను తెప్పించి వివిధ రకాల వస్తువులను తయారు చేసినందుకు గాను సస్పెన్షన్

  • 29 Jun 2020 2:13 PM GMT

    _నాగరత్న ఐఎండి అసిస్టెంట్ డైరెక్టర్ @ హైదరాబాద్....

    - దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది...

    - మరట్వాడ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం 3.5 కి.మి ఆవరించి ఉంది...

    - మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతోంది...

    - ఉపరితల ఆవర్తనం వల్ల రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది....

    - ఉరుములు ,మెరుపులతో పాటు 30 కి.మీ వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది....

    - ఇవాళ ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    - సంగారెడ్డి, మెదక్ ,సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ ,వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

  • 29 Jun 2020 12:24 PM GMT

    పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టం ఎప్పుడు ఫెయిల్ కాదు : సీపీ అంజనీ కుమార్

    - నక్సల్స్ సమస్య నుంచి కరోనా వరకు అన్ని సమస్యలను పోలీసులు ముందుడి ఎదుర్కొంటున్నారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు.

    - దేశంలోని ఇతర ప్రధాన సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువ కేసులు రావడానికి సిటీ పోలీసులే కారణం అని ఆయన తెలిపారు.

    - మా డిపార్ట్మెంట్ హీరోస్ ను వెల్కమ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

    - పోలీస్ డిపార్ట్మెంట్ సిస్టం ఎప్పుడు ఫెయిల్ కాదన్నారు.

    -జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకు ప్రతీ సందర్భంలో పోలీసులు ముందున్నారన్నారు.

    - కరోనాను ఎదుర్కోవడంలో సిటీ పోలీసుల కృషి చరిత్రలో నిలుస్తుందన్నారు.

    - కరోనాను జయించాక తిరిగి మాస్కులు...సానిటైజర్లు వాడాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి ఆయన సూచించారు.

    - ప్రతి ఒక్క పోలీసుల కుటుంబసభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.



  • 29 Jun 2020 10:22 AM GMT

    మచిలీపట్నం

    - జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్య

    - మార్కెట్ లో ఉండగా కత్తితో పొడిచి పరారైన గుర్తు తెలియని వ్యక్తి

    - దాడిలో గాయపడ్డ భాస్కరరావు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

    - చికిత్స పొందుతూ మృతి

    - పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగినట్టు అనుమానం

    - ఆస్పత్రికి భారీగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు

    - భారీగా మోహరించిన పోలీసులు

    - గతంలో మచిలీపట్నం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గా పని చేసిన భాస్కరరావు



  • 29 Jun 2020 10:20 AM GMT

    కృష్ణాజిల్లా

    - నందిగామ మండలం మనగచర్ల గ్రామానికి చెందిన క్రైమ్ ఇండియా రిపోర్టర్ గంట నవీన్ హత్య కేసును ఛేదించిన నందిగామ పోలీసులు.

    - ఈ కేసులో తొమ్మిది మంది నేరస్తులను మీడియా ముందు హాజరు పరిచిన నందిగామ డిఎస్పీ.

    - తొమ్మిది మందిలో ఒకరు బాల నేరస్తుడు.

  • 29 Jun 2020 10:14 AM GMT

    కృష్ణాజిల్లా :

    - మచిలీపట్నం.

    - మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరావు పై మునిసిపల్ చేపల మార్కెట్ లో హత్యాయత్నం.

    - కత్తితో పొడిచి పరారైన గుర్తు తెలియని వ్యక్తి . హాస్పిటల్ కు తరలింపు.

  • 29 Jun 2020 9:47 AM GMT

    ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

    - నగరంలోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఉధ్రిక్త వాతావరనం నెలకొంది.

    - తమిళనాడు, ఆంద్రప్రదేశ్, కేరళ బార్డర్ టాక్స్ ఏడాది కాలం పాటు రద్దు చేయాలంటూ, తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ పర్మిషన్ ఇవ్వాలంటూ స్టేట్‌ క్యాబ్స్‌ అండ్‌ బస్‌ ఆపరేటర్‌ అసోసియేషన్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టింది.

    - పూర్తి వివరాలు 

  • 29 Jun 2020 9:45 AM GMT

    జూలై 2 న తెరుచుకోనున్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం

    - కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా అన్ని దేవాలయాలు మూత పడిన విషయం తెలిసిందే.

    - ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కొన్ని ఆలయాలను తెరచి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నప్పటికీ, మరి కొన్ని ఆలయాలు ఇంకా తెరచుకోకుండానే ఉన్నాయి.

    - ఆ ఆలయాల జాబితాలో మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠం కూడా ఒకటి.

    - పూర్తి వివరాలు 

Print Article
More On
Next Story
More Stories