Live Updates:ఈరోజు (జూన్-06) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 06 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు శనివారం, 06 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, పాడ్యమి (రాత్రి 10:32వరకు), తదుపరి విదియ సూర్యోదయం 5:40 am, సూర్యాస్తమయం 6:48 pm
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 6 Jun 2020 8:06 AM IST
నేటి నుంచి ఏపీలో కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం
►ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డుల దరఖాస్తులు..
► దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోనే అర్హులకు రేషన్ కార్డు
►రేషన్కార్డుదారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీ
- 6 Jun 2020 8:05 AM IST
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేటి నుంచి హైపవర్ కమిటీ విచారణ
►నేటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న హైపవర్ కమిటీ
►తొలిరోజు నిపుణుల కమిటీలతో రెండు దశల్లో హైపవర్ కమిటీ భేటీ
►రెండో రోజు వీఎంఆర్డీఏ ప్రాంగణంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం..
►మూడో రోజు రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించనున్న హైపవర్ కమిటీ..

- 6 Jun 2020 8:03 AM IST
జూన్ 9 నుంచి కేరళలో దైవ దర్శనాలు
- కేరళలోనూ జూన్ 9 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లు తిరిగి ప్రారంభిస్తున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.
- కేంద్ర మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు.
- శబరిమలలో ఒకసారి 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని సీఎం స్పష్టం చేశారు.
- వర్చువల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రద్దీని నియంత్రిస్తామని తెలిపారు సీఎం పినరయి విజయన్.

- 6 Jun 2020 6:54 AM IST
కరోనా వైరస్ కేసుల్లో ఇటలీకి చేరువలో ఇండియా!
- రోగుల సంఖ్యలో ఇటలీని మన దేశం దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
- శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి.
- దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానానికి దగ్గరలో నిలిచింది.
- తాజాగా 24 గంటల్లో 9,851 మంది వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు.
- దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే.
- మరోవైపు, మరణాల సంఖ్యా పెరుగుతోంది.
. 24 గంటల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 273 మంది కన్నుమూశారు.
- రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇప్నాపటివరకూ నాలుగో స్థానంలో ఉన్న భారత్.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.




