Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్టు-04)ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 04 ఆగస్టు, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు మంగళవారం, 04 ఆగస్టు, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం పాడ్యమి (రాత్రి 8-52 వరకు) తదుపరి విదియ, శ్రవణ నక్షత్రం (ఉ. 8-15 వరకు) తర్వాత ధనిష్ఠ నక్షత్రం.. అమృత ఘడియలు ( రాత్రి 10-29 నుంచి 12-09 వరకు), వర్జ్యం (మ. 12-26 నుంచి 2-06 వరకు) దుర్ముహూర్తం (ఉ. 8-15 నుంచి 9-06 వరకు తిరిగి రాత్రి 10-58 నుంచి 11-43 వరకు) రాహుకాలం (మ. 3-00 నుంచి 4-30 వరకు) సూర్యోదయం ఉ.5-42 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు


Show Full Article

Live Updates

  • ఏపీ పంచాయితీరాజ్ చట్టంపై  మరోమారు ఆర్డినెన్సు జారీ
    4 Aug 2020 4:57 PM GMT

    ఏపీ పంచాయితీరాజ్ చట్టంపై మరోమారు ఆర్డినెన్సు జారీ

    అమరావతి: పంచాయితీరాజ్ చట్టంలో సవరణలు తీసుకువస్తు ఇచ్చిన ఆర్డినెన్సు కాలపరిమితి ముగిసిపోవటంతో మరోమారు ఆర్డినెన్సు జారీ చేసిన ప్రభుత్వం

    - ఆరు నెలల్లో చట్ట రూపం దాల్చకపోవటంతో మళ్లీ ఆర్డినెన్సు జారీ

    - స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణల పై గతంలో తీసుకువచ్చిన అర్డినెన్సుకు ముగిసిన కాలపరిమమితి

    - ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు , సర్పంచ్ లు ఎన్నికల ప్రక్రియ వ్యవధిని 13 నుంచి 15 రోజులను కుదిస్తూ గతంలో ఆర్డినెన్సు జారీ

    - స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసిన అభ్యర్ధులపై అనర్హతా వేటు వేసేలా ఆర్డినెన్సు

  • అతి చిన్న పుంగనూరు ఆవు దూడ
    4 Aug 2020 4:28 PM GMT

    అతి చిన్న పుంగనూరు ఆవు దూడ

    తూర్పు గోదావరి: మలికిపురం మం. పడమటి పాలెం లో జన్మించిన అతి చిన్న పుంగనూరు ఆవు దూడ- 

    పడమటి పాలెం కి చెందిన గుండా బత్తుల మధు అనే జంతు ప్రేమికుడు పెంచుతున్న దేశీయ ఆవుకు అరుదైన పుంగనూరు దూడకి జన్మనిచ్చింది.

    కేవలం 15 అంగుళాల ఎత్తు మాత్రమే వుంది.

    సాధారణంగా పొట్టిగా వుండటం ఈ పుంగనూరు ఆవుల లక్షణం

    అయితే దూడ మరీ పొట్టిగా వుండటంతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది

  • 4 Aug 2020 12:20 PM GMT

    నెల్లూరు:

    - నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న కరోనా విలయం.

    - తాజాగా ఈ వాళ మరో 557 పాజిటివ్ కేసులు నమోదు.

    - జిల్లాలో మొత్తం 9899 కి చేరిన బాధితుల సంఖ్య.

  • 4 Aug 2020 12:18 PM GMT

    కర్నూలు జిల్లా:

    - వెలుగోడు అత్యాచారం కేసులో ఇద్దరు ముద్దాయిల అరెస్ట్..

    - ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలిసులు..

    - వైద్య పరిక్షల అనంతరం రిమాండ్ కు తరలింపు..

    - పరారిలో ఉన్న ఇంకొక నిందితుని కోసం గాలిస్తున్నాం..త్వరలోనే అరెస్టు చేస్తాం ఆత్మకూరు DSP వెంకటరావు..

  • 4 Aug 2020 12:17 PM GMT

    పారిశ్రామిక ప్రమాదాలపై క్యాంపుకార్యాలయంలో సమీక్షా సమావేశంలో సీఎం

    అమరావతి: 

    - పారిశ్రామిక ప్రమాదాలపై క్యాంపుకార్యాలయంలో సమీక్షా సమావేశంలో సీఎం

    - పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ

    - సేఫ్టీ పాలసీని ప్రతిపాదించిన అధికారులు

    - పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ సేఫ్టీ పాలసీ కిందకు

    - ఏడాదికి రెండు సార్లు కాంప్లియన్స్‌ నివేదికలు

    - నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

    - ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం

    - థర్డ్‌పార్టీ తనిఖీలు

  • 4 Aug 2020 12:16 PM GMT

    ప్లాస్మా పై ప్రజల్లో చైతన్యం పెరగాలి.

    నెల్లూరు:

    - వెంకటగిరి లో జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆకస్మిక పర్యటన.

    -  కోవిడ్ ప్రభావం పై అధికారులు, వాలంటీర్ లతో సమావేశం.

    - కారోనా కట్టడికోసం అందరూ జాగ్రత్తలు పాటించాలి.

    -  ప్లాస్మా పై ప్రజల్లో చైతన్యం పెరగాలి.

    -  ప్లాస్మా  చేసినవారికి ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకాలు

    -  ప్లాస్మా దానంతో సత్వరం కరోనా బాధితులు కోలుకుంటారు..జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు.

  • 4 Aug 2020 12:15 PM GMT

    ప్రవైట్ హాస్పిటల్స్ పై కొనసాగుతున్న చర్యలు

    - ఇప్పటికే డెక్కన్ హాస్పిటల్ కు కరోన ట్రీట్మెంట్ అనుమతి రద్దు

    - ఇవాళ మరో రెండు ఆస్పత్రులపై చర్యలు.తీసుకోనున్న వైద్య ఆరోగ్య శాఖ

    - వైద్య ఆరోగ్య శాఖ వాట్స్ up నెంబర్ కు ఫిర్యాదుల వెల్లువ

    - ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీలు

    - తప్పు చేసినట్లు రుజువు అయితే చర్యలు తీసుకుంటామని స్పష్టం

  • 4 Aug 2020 12:13 PM GMT

    పొన్నాల లక్ష్మయ్య మాజీ మంత్రి

    - ఏపీ సీఎం కృష్ణ నీళ్లను రాయలసీమకు తరలిస్తామని అంటే.. తెలంగాణ సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

    - మేము గట్టిగా మాట్లాడితే అపెక్స్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామన్నారు.

    - తీర అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెడితే వాయిదా వేయమన్నాడు.

    - కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు.

    - క్షమించరాని చారిత్రక తప్పిదాలు చేస్తున్నాడు కేసీఆర్.

    - జగన్ కెసిఆర్ కలిసే పనిచేస్తున్నారనే అనుమానాలున్నాయి.

    - ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిపై మేము ప్రతిపాదించిన ప్రాజెక్టుల ను కేసీఆర్ సీఎం అయ్యాక పక్కన పెట్టారు.

    - దుమ్ముగూడెం, కంతాల పల్లి ప్రాజెక్టు లను పక్కన పెట్టాడు.

    - రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఆనాడు మేము

    - అఖిల పక్ష నేతలను తీసుకెళ్లి బాబ్లీపై కేంద్రానికి ఫిర్యాదు చేశాము.

    - కానీ కెసిఆర్ ఎవరితోనూ సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు.

    - 10 లక్షల ఎకరాలకు నీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలి.

    - పక్క రాష్ట్ర ఆగడాలను అరికట్టాలి.

    - కెసిఆర్ కు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా తన వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా..

  • 4 Aug 2020 12:12 PM GMT

    జిల్లాలో ప్రారంభమైన విద్యావారధి వాహనం..

    శ్రీకాకుళం జిల్లా:

    - ఎటువంటి సాంకేతిక సదుపాయం లేని విద్యార్థులకు ఎల్.ఈ.డి పై పాఠాల బోధన..

    - గిరిజన, షెడ్యూల్డ్, మత్స్యకార, తీర ప్రాంతాల్లో విద్యార్థులకు ప్రాధాన్యం..

    - ఈ వాహనం ద్వారా విద్యార్థులకు బోధన అందుబాటులోకి తెచ్చిన అధికారులు..

    - వయస్సు బట్టి పాఠాలు, వీడియోలు, కథలు, ప్రసాలు బోధించనున్న ఉపాద్యాయులు..

  • 4 Aug 2020 12:11 PM GMT

    మూడు రాజధానులపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కామెంట్స్

    తూర్పుగోదావరి జిల్లా:

    కొత్తపేట: మూడు రాజధానులపై శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం కామెంట్స్

    ◆ మూడు రాజధానులు కావాలంటే ప్రజాతీర్పు కావాలి◆

    ◆ మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు విసిరిన సవాల్ స్వీకరించాలి◆

    ◆ ఆనాడు జగన్మోహనరెడ్డి ప్రతిపక్షంలో అమరావతిని సమ్మతించి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పి మడమ తిప్పుతారా◆

    ◆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేత శంకుస్థాపన చేసి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక భవంతులు నిర్మిస్తే మార్పు దేనికోసం ఎవరికోసం◆

    ◆ వైసీపీ నేతలు మినహా అన్నిరాజకీయ పక్షాలు మూడు రాజధానులు నిర్ణయానికి వ్యతిరేకం◆

    ◆ మూడు రాజధానులు కావాలంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పు కోరాలి లేదంటే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి◆

Print Article
Next Story
More Stories