Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-26) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 26 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 26 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. భాద్రపద మాసం, శుక్లపక్షం అష్టమి: (మ. 2-35 వరకు) తదుపరి నవమి, అనూరాధ నక్షత్రం (సా. 5-42 వరకు) తదుపరి జ్యేష్ఠ అమృత ఘడియలు (ఉ. 7-53 నుంచి 9-24 వరకు) వర్జ్యం (రా. 11-02 నుంచి 12-33 వరకు) దుర్ముహూర్తం (ఉ. 11-37 నుంచి 12-27 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం: ఉ.5-48 సూర్యాస్తమయం: సా.6-17

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 26 Aug 2020 12:25 PM GMT

    నెల్లూరు 

    -- మండల కేంద్రం కలిగిరి సమీపంలో ఉత్తర కాలువ గట్టున పేకాట స్థావరాలపై పోలీసులు దాడి

    -- నాలుగురు పేకాట రా యుళ్లు అరెస్ట్. రూ. 3,100 లు నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం.

  • 26 Aug 2020 12:25 PM GMT

    Coronavirus: తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు మొత్తం 1528 కోవిడ్ కేసులు నమోదు..

    కాకినాడ

    - తూర్పు గోదావరి జిల్లాలో ఈరోజు మొత్తం 1528 కోవిడ్ కేసులు నమోదు..

    - కాకినాడ అర్బన్ లో 259

    - కాకినాడ రూరల్ లో 40

    - రాజమండ్రి సిటీ లో 247

    - రాజమండ్రి రూరల్ 36 కేసులు నమోదు

  • 26 Aug 2020 12:23 PM GMT

    Swarna Palace: స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పోలీసుల విచారణకు ఆటంకం

    విజయవాడ

    - స్వర్ణ ప్యాలెస్ ఘటనలో పోలీసుల విచారణకు ఆటంకం

    - విచారణకు హాజరు కాని రిమాండ్ నిందితుల తరఫు న్యాయవాదులు

    - న్యాయవాదుల సమక్షంలోనే నిందితులను విచారించాలని ఆదేశించిన జిల్లా కోర్టు

    - జిల్లా జైలులో న్యాయవాదుల కోసం ఎదురుచూసి వెనుతిరిగిన పోలీసులు

    - న్యాయవాదుల సహాయ నిరాకరణ పై జిల్లా కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్న పోలీసులు

  • 26 Aug 2020 12:22 PM GMT

    జాతీయం

    - కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో నీట్‌ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులతో పాటు, విపక్ష సీఎంలు, నేతలు డిమాండ్‌ .

    - కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ కు హాజరయిన ముఖ్యమంత్రులు అమరీందర్‌ సింగ్‌, అశోక్‌ గహ్లోత్‌, భూపేష్‌ బాగేల్‌, హేమంత్‌ సోరేన్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాక్రేలు .

    - నీట్ పరీక్షవాయిదా అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్‌ పాలిత సీఎంలు నిర్ణయం.

    - ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై ఆందోళన .

    - రాష్ట్రాలకు సరైన సమయంలో జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదని, బకాయిలు పెరిగిపోయాయని సోనియా గాంధీ ఆరోపణ. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో కేంద్రం లేదన్న సోనియాగాంధీ.

    - రైల్వేల ప్రైవేటీకరణ, ఎయిర్‌పోర్టుల వేలం నిర్ణయాలను తప్పుపట్టిన సోనియా

    - కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జాతీయ విద్యా విధానం సరిగా లేదని విమర్శ.

    - పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం.

    - నీట్‌ పరీక్షపై విద్యార్ధులు, తల్లితండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయన్న రాహుల్‌ గాంధీ

    - దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించాయని ఈ పరిస్థితుల్లో నీట్‌ పరీక్ష నిర్వహించడం సరికాదనన్న రాహుల్‌ గాంధీ.

    - అందరి అభిప్రాయాలూ కేంద్రం తెలుసుకున్న తర్వాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి

  • 26 Aug 2020 12:08 PM GMT

    Nellore: జిల్లాలో కరోనా విలయతాండవం..

    నెల్లూరు

    -- జిల్లాలో కరోనా విలయతాండవం.

    -- గడచిన 24 గంటల్లో 1168 కి మందికి సోకిన మహమ్మారి.

    -- జిల్లా వ్యాప్తంగా 20, 569 చేరిన వైరస్ బాధితుల సంఖ్య.

    -- రికవరీ లో రేటు పెరుగుతు న్నా.. ఆందోళన కలిగిస్తున్న మరణాలు సంఖ్య. ఇప్పటివరకు 400 మందికీ పైగా మృతి.

  • 26 Aug 2020 12:08 PM GMT

    Andhra Pradesh: ఆంధ్రా తమిళనాడు బార్డర్ లో సినీ ఫక్కీలో దొంగతనం

    - ఆంధ్రా తమిళనాడు బార్డర్ లో సినీ ఫక్కీలో దొంగతనం

    - నిన్న రాత్రి శ్రీపేరంబుర్ నుండి ముంబై కి వెళ్తున్న మొబైల్ కంటైనర్ ని సినీ ఫక్కీలో ఆంధ్ర బార్డర్ నగిరి వద్ద మరో లారీ తో అడ్డం పెట్టి డ్రైవర్ ని కొట్టి అందులో ఉన్నటువంటి 6 కోట్ల రూపాయలు విలువ చేసే మొబైల్స్ ను దోచుకెళ్లిన దుండగులు ...

    - లారీల మొత్తం 12 కోట్లు విలువ చేసే మొబైల్ ఫోన్లు ఉన్నట్టుగా సమాచారం

    - అందులో 16 బాక్స్ లు ఉండగా 8 బాక్సుల్లో 7500 మొబైల్ ఫోన్ ని దోచుకెళ్లారు

    - మొబైల్ ఫోన్లు అన్నీ కూడా షామీ కంపెనీ చెందినవి

    - మొబైల్ ఉన్న లారీని తీసుకొని పుత్తూరు మొబైల్స్ అని మరో లారీ లోకి మార్చుకుని లారీని పుత్తూరులో వదిలేసి వెళ్లిన దుండగులు పరార్.

  • 26 Aug 2020 12:07 PM GMT

    తూర్పు గోదావరి -

    - రాజమండ్రి- పెద్దాపురం

    - మాజీ ఉపముఖ్యమంత్రి , పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ప్రెస్ మీట్ పాయింట్స్......

    - కరోనా సమయంలోనూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు విడనాడక పోవడం విచారకరం...

    - నాలుగేళ్ల క్రితం ముగిసిన కృష్ణా పుష్కరా పనులపై ఇప్పడు విచారణకు ఆదేశించడం ఏమిటి

    - కృష్ణా పుష్కరాల ఏర్పాట్లలో మా ప్రభుత్వం ఘాట్ల నిర్మాణం జరిగే గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో అనుసంధానం రహదారుల నిర్మాణం, దేవాలయాల ఆధునీకరణ, విజయవాడ కార్పొరేషన్ సుందరీకరణ పనులు చేసిఁది

    - నాలుగేళ్ళ తర్వాత విచారణకు ఆదేశించడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే....

    - ఇదే పంథాలో ఎమ్.జి.ఎన్.ఆర్.జి.యస్ పనులపై కూడా విచారణ పేరుతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండాఇబ్బందులు పెడుతున్నారు.....

    - ఈ రోజు ప్రకాశం జిల్లాలో మాజీ తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, రామారావులకు చెందిన గ్రానైట్ లీజు రద్దుచేయడం వైకాపా కక్ష సాధింపులకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం చినరాజప్ప

  • 26 Aug 2020 10:09 AM GMT

    Tirumala: సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

    సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

    కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

    - సెప్టెంబరు 1న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం

    - సెప్టెంబరు 17న మహాలయ అమావాస్య.

    - సెప్టెంబరు 18న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.

    - సెప్టెంబరు 19న ధ్వ‌జారోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.

    - సెప్టెంబరు 23న శ్రీవారి గరుడసేవ.

    - సెప్టెంబరు 24న శ్రీవారి స్వర్ణరథోత్సవం.

    - సెప్టెంబరు 26న ర‌థోత్స‌వం.

    - సెప్టెంబరు 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు స‌మాప్తి.

    - సెప్టెంబరు 28న  శ్రీవారి బాగ్‌ సవారి ఉత్సవం.

  • 26 Aug 2020 10:08 AM GMT

    Peddapuram: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు చిన రాజప్ప కామెంట్స్

    తూర్పు గోదావరి:

    పెద్దాపురం: మాజీ ఉపముఖ్యమంత్రి మరియు పెద్దాపురం శాసనసభ్యులు చిన రాజప్ప కామెంట్స్

    - వైసిపి ప్రభుత్వం కరోనా సమయంలోనూ కక్ష సాధింపు చర్యలు ఆపకపోవడం గర్హనీయం.

    - నాలుగేళ్ల క్రితం ముగిసిన కృష్ణా పుష్కరా పనులపై ఇప్పడు విచారణకు ఆదేశించడం.శోచనీయం...

    - కృష్ణా పుష్కరాలు ముగిసి 4 సంవత్సరాల తరువాత విచారణకు ఆదేశించడం కక్ష సాధింపు చర్యల్లో భాగమే.... ఇప్పటికే గుత్త సంస్థల నిర్వహణ కాలపరిమితి ముగిసింది.

    - ఇదే పంథాలో ఎమ్.జి.ఎన్.ఆర్.జి.యస్ పనులపై కూడా విచారణ పేరుతో గుత్తేదారులకు బిల్లులు చెల్లించకుండా... ఇబ్బందులు పెడుతున్నారు.

    - ముఖ్యమంత్రి కి ఇష్టంలేని విషయాలపై విచారణకు ఆదేశించడం పరిపాటి అయింది.

    - కృష్ణా పుష్కర పనులు అన్ని నీటిపారుదల శాఖ, రహదారుల భవానాల శాఖ, నగర పాలక సంస్థ అధికారులతో నిర్వహించడం జరిగింది.... కావున ప్రభుత్వం వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

    - ప్రకాశం జిల్లాలో మాజీ తెదేపా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, రామారావులకు చెందిన గ్రానైట్ లీజు రద్దుచేయడం వైకాపా కక్ష సాధింపులకు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం.

  • 26 Aug 2020 10:06 AM GMT

    Sajjala Ramakrishna Reddy: సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు

    అమరావతి...

    - సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రభుత్వ సలహాదారు

    - పేదల ఇళ్ల స్థలాలకు అడ్డం పడుతున్న టీడీపీని లెఫ్ట్ పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదు..

    - పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకుంటున్న టీడీపీతో కలిసి ధర్నాలు చేయడం ఏమిటి..

    - పాలన వికేంద్రీకరణపై ఏడాది పాటు చర్చించి నిర్ణయం తీసుకున్నాము..

    - పాలన వికేంద్రీకరణ చేసేది ప్రజలు కోసమే..

    - టీడీపీ ఉద్దేశ్యపూర్వకంగా ఎదో లిటికేషన్ పెట్టి పాలన వికేంద్రీకరణను అడ్డుకోవాలని చూస్తుంది..

    - న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకు ఉంది..

    - ప్రమాదంలో రమేష్ హాస్పిటల్ యాజమాన్యం తప్పు ఉంది..

    - రమేష్ ఏ తప్పు చేయకపోతే పోవాల్సిన అవసరం ఏమి ఉంది..

    - సుప్రీంకోర్టు తీర్పుపై కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయి..

Print Article
Next Story
More Stories