Live Updates: ఈరోజు (22 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు ఆదివారం | 22 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | కార్తిక మాసం | శుక్లపక్షం | అష్టమి - 22:53:39 వరకు తదుపరి నవమి | ధనిశ్ఠ - 11:09:53 వరకు తదుపరి శతభిష | వర్జ్యం 14:50:57 నుండి 16:15:16 | అమృత ఘడియలు 11:39:51 నుండి 12:24:49 | దుర్ముహూర్తం 16:09:39 నుండి 16:54:37 | రాహుకాలం 16:15:16 నుండి 17:39:34 | సూర్యోదయం: ఉ.06-24 | సూర్యాస్తమయం: సా.05-39

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Visakha Updates: పద్మనాభం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు...
    22 Nov 2020 12:46 PM GMT

    Visakha Updates: పద్మనాభం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అవంతి శ్రీనివాసరావు...

     విశాఖ

    *అనంతరం వెంకటాపురంలో వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంచిన మంత్రి.

    *మంత్రి అవంతి శ్రీనివాసరావు కామెంట్స్

    *జిల్లా వ్యాప్తంగా 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.

    *రైతులు 17 శాతం తేమతో ఉన్న ధాన్యాన్ని కేంద్రానికి తీసుకు రావచ్చు.

    *మద్దతు ధర గ్రేడ్ వన్ 1888 రూపాయలు, సాధారణ రకం 1868 రూపాయలు.

    *తుఫాన్ , వరదల వల్ల పంట ఎంత నష్టయిన పూర్తిగా నష్ట పరిహారాన్ని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

    *సాగునీరు అందుబాటులో లేని మెట్ట, బీడు భూముల రైతుల‌కు వైయ‌స్ఆర్ జ‌ల‌క‌ళ ప‌థ‌కం ఒక వ‌రం లాంటిది.

    *అందుబాటులో ఉన్న భూగర్భజల వనరులను ఉపయోగించుకుంటూ ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాము.

  • Nellore District Updates: తోటపల్లి గూడూరు (మం) వరకవిపూడి గ్రామంలో వివాదం..
    22 Nov 2020 12:42 PM GMT

    Nellore District Updates: తోటపల్లి గూడూరు (మం) వరకవిపూడి గ్రామంలో వివాదం..

      నెల్లూరు...

    - తోటపల్లి గూడూరు (మం) వరకవిపూడి గ్రామంలో చెరువు వేలం పాట నగదు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ....

    - కత్తులతో పరస్పరం దాడులు.. పలువురికి తీవ్ర గాయాలు...

    - బాధితులు నక్క పెంచాలయ్య, కోవూరు శ్రీను, పల్లం. ఆదిలక్ష్మి ల ను 108 వాహనం ద్వారా నెల్లూరుకి తరలింపు...

    - మరో కొంతమంది స్వల్ప గాయాలు..

    - గ్రామంలో పోలీస్ పికిటింగ్ ఏర్పాటు చేసిన ఎస్. ఐ ఇంద్రసేనా రెడ్డి....

  • Tirumala Updates: కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం..
    22 Nov 2020 11:55 AM GMT

    Tirumala Updates: కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం..

       తిరుమల

    * ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కార్తీక వనమహోత్సవం కార్యక్రమంను అద్భుతంగా నిర్వహించాం.

    * కోవిడ్-19 నిబంధనలు మేరకు పార్వేటి మండపంలో ఏకాంతంగా నిర్వహించాం.

    * కోవిడ్ నిబంధనలను పాటిస్తూ 250 భక్తులతో కార్యక్రమం నిర్వహించాము.

    * కార్తీకవన మహోత్సవం సందర్భంగా వర్చువల్ ఆర్జిత సేవలను రద్దు చేసాం.

    * రేపటి నుండి భక్తులకు యధాతథంగా వర్చువల్ సేవలు వుంటాయి.

    * ఏవి.ధర్మారెడ్డి, టీటీడీ అదనపు ఈవో

  • Vijayawada Updates: శ్రీనివాసరావు తన సెల్ఫీ వీడియో ద్వారా చేసిన ఆరోపణలు నిరాధారం...
    22 Nov 2020 11:08 AM GMT

    Vijayawada Updates: శ్రీనివాసరావు తన సెల్ఫీ వీడియో ద్వారా చేసిన ఆరోపణలు నిరాధారం...

      విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కార్యాలయము రీజాయిండర్

      సీపీ బి.శ్రీనివాసులు

    * ఏ.ఆర్.హెచ్.సి. - 471, శ్రీనివాసరావు తన సెల్ఫీ వీడియో ద్వారా చేసిన ఆరోపణలు నిరాధారం

    * విజయవాడ నగర పోలీసులు ప్రతి నిత్యం ఎన్నో మానసిక, శారీరక ఒత్తిడులు ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు

    * విజయవాడ పోలీసుల పని తీరుపైన, పోలీసు జాగిలాల పని తీరు, వాటి సామర్ధ్యం సరిగా లేదని చేసిన ఆరోపణలు నిరాధారం

    * వి.ఐ.పి/వి.వి.ఐ.పి.ల రక్షణ దృష్యా, హత్య కేసులు, దొంగతనం వంటి కేసుల్లో పోలీసు జాగిలాల పాత్ర చాల కీలకమైనది

    * వెటర్నరీ డాక్టరు నిరంతర పర్యవేక్షణలో, పోలీసు జాగిలాల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది

    * కొంత కాలంగా శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితి బాగోనందున సిక్ లో ఉన్నారు

    * ఆర్ముడు రిజర్వు హెచ్.సి.-471, శ్రీనివాసరావు 2005 నుండి డాగ్ హ్యాండలర్ గా విధులు నిర్వహిస్తున్నారు

    * 15 సంవత్సరముల తర్వాత సాధారణ బదిలీలలో భాగంగా డాగ్ స్వాడ్ విధుల నుండి ఆర్ముడు రిజర్వు డ్యూటీలకు పంపడం జరిగింది

    * అతను వాలంటరీ రిటైర్మెంట్ ఇంతవరకు కోరలేదు, ఏవిధమైన అభ్యర్థన సమర్పించలేదు

    * అతని అభియోగాలన్ని సత్యదూరాలు

  • Amaravati Updates: టిడిపి ఎంపిటిసి అభ్యర్ధి భర్తపై హత్యాయత్నాన్ని ఖండించిన చంద్రబాబు...
    22 Nov 2020 11:01 AM GMT

    Amaravati Updates: టిడిపి ఎంపిటిసి అభ్యర్ధి భర్తపై హత్యాయత్నాన్ని ఖండించిన చంద్రబాబు...

      అమరావతి..

    * ఫోన్ చేసి బాధితులను పరామర్శించిన చంద్రబాబు

    * టిడిపి అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన చంద్రబాబు

  • Rajahmundry Updates: రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు...
    22 Nov 2020 10:59 AM GMT

    Rajahmundry Updates: రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు...

     తూర్పుగోదావరి-రాజమండ్రి..

    - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..

    - ఇరిగేషన్ శాఖా మంత్రి అనిల్ యాదవ్ కు లేఖ ఇవ్వడంతో 22న సిపిఐ రామకృష్ణ బృందం పోలవరం సందర్శనకు అధికారులకు ఆదేశాలిచ్చారు

    - పోలవరం చీఫ్ ఇంజనీరు సుధాకర్ బాబు కాల్ చేసి ఎలా వస్తున్నారు అని అడిగారు

    - అనుమతి కోసం లెటర్ సానుకూలంగా స్పందిస్తే ఇపుడు పోలీసులుఎందుకు అడ్డుకుంటున్నారు

    - రాష్ట్రంలో సిఎం జగన్ ప్రభుత్వమా, డిజీపి గౌతమ్ సవాంగ్ ప్రభుత్వం నడుస్తుందా

    - జగన్ ప్రభుత్వం మాకు కన్పించడం లేదు. ఇరిగేషన్ మంత్రి మాటకు విలువలేదా

    - ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి

    - ఇలాంటి నిర్భంధం ఎందుకు చేస్తారు

    - పోలవరం ప్రాజెక్టు కావాలని అందరూ కోరుకుంటున్న ప్రాజెక్టు

    - పోలవరం ప్రాజెక్టు సందర్శించే వెళతాం..ఇందుకు ప్రభుత్వం స్పందించాలి

    - పోలవరానికి వెళ్ళి అన్నిపరిశీలించాకే అక్కడ పరిస్థితులు ,ఎత్తు తగ్గింపులపై మాట్లాడతాను

  • Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్...
    22 Nov 2020 5:13 AM GMT

    Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్...

      తిరుమల

    - సత్యకుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

    - కరోనా మహమ్మారి నుంచి విశ్వ మానవాళికి విముక్తి జరగాలని ప్రార్ధించాను.

    - టీటీడీ పవిత్రతను కాపాడాలి, ఆలయ భూములు ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలని కోరుతున్నా..

    - భక్తి భావంతో భక్తులు స్వామి వారిని సమర్పించే కానుకలు ధర్మపరిక్షణ కోసం ధార్మిక కార్యక్రమాల కోసమే వాడాలి.

  • Guntur District Updates: నరసరావుపేటలో వార్డు వాలంటీర్ పై భాను ప్రకాష్ అనే యువకుడి దాడి..
    22 Nov 2020 5:09 AM GMT

    Guntur District Updates: నరసరావుపేటలో వార్డు వాలంటీర్ పై భాను ప్రకాష్ అనే యువకుడి దాడి..

      గుంటూరు ..

    * నరసరావుపేటలో వార్డు వాలంటీర్ షేక్ మస్తాన్ వలి పై భాను ప్రకాష్ అనే యువకుడి దాడి.

    * భాను ప్రకాష్ స్థానిక వైసిపి నేత తనయుడిగా గుర్తించి స్థానికులు.

    * దాడిలో ధ్వంసమైన సచివాలయ ఫర్నిచర్.

    * భాను ప్రకాష్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.

  • Tirumala Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు...
    22 Nov 2020 5:02 AM GMT

    Tirumala Updates: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు...

      తిరుమల

    // ఆలయ మర్యాదలతో ఉడిపి పెజవర్ పిఠాదిపతి విశ్వ ప్రసన్న తీర్థ స్వామీజీ.

    // బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్.

    // ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి.

    // మధ్యప్రదేశ్ మంత్రి ఆరవింద బహుదురియా.

    // విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ.

    // పోరుబందర్ పార్లమెంట్ సభ్యుడు రమేష్ బాయి దుడుకు.

  • Krishna Updates: వీరులపాడు నుండి అక్రమంగా మద్యం సీసాలు స్వాధీనం..
    22 Nov 2020 4:08 AM GMT

    Krishna Updates: వీరులపాడు నుండి అక్రమంగా మద్యం సీసాలు స్వాధీనం..

      కృష్ణాజిల్లా..

    * వీరులపాడు (మం) పెద్దాపురం వద్ద తెలంగాణ నుండి అక్రమంగా 500 మద్యం సీసాలు స్వాధీనం

    * ఒక వ్యక్తి అరెస్టు చేసి, ఒక బైక్ స్వాధీనం చేసుకున్న వీరులపాడు పోలీసులు

Print Article
Next Story
More Stories