Live Updates: ఈరోజు (సెప్టెంబర్-21) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 21 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | చవితి ఉ. 7-41వరకు పంచమి తె. 5.24వరకు తదుపరి షష్ఠి | విశాఖ నక్షత్రం తె. 3-06 వరకు తదుపరి అనూరాధ | వర్జ్యం ఉ.9-54 నుంచి 11-24 వరకు | అమృత ఘడియలు: సా. 6-52 నుంచి 8-22 వరకు | దుర్ముహూర్తం: మ. 12-18 నుంచి 1-07 వరకు తిరిగి 2-43 నుంచి 3-32 వరకు | రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-57

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • Amaravati updates: పోలీస్‌ సేవ యాప్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్‌..
    21 Sep 2020 10:28 AM GMT

    Amaravati updates: పోలీస్‌ సేవ యాప్‌కు సంబంధించిన పోస్టర్ రిలీజ్‌..

    అమరావతి..

    సీఎం పాయింట్స్..

    -పౌరులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఏపీ పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఏపీ పోలీస్‌ సేవ (సిటిజెన్‌ సర్వీసెస్‌ అప్లికేషన్‌)‌‌యాప్‌ను     ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌

    -పోలీసు ఫీల్డ్‌ ఆఫీసర్లకు అత్యాధునిక ట్యాబ్‌లు అందజేసిన సీఎం.

    -పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం చాలా తగ్గుతుంది.

    -సర్టిఫికెట్‌ కావాలన్నా, డాక్యుమెంట్లు పోయినా, ఏవైనా లైసెన్సులు రెన్యువల్‌ చేయించుకోవాలన్నా, ఎన్‌ఓసీ కావాలన్నా పోలీస్‌ స్టేషన్‌కు పోవాల్సిన అవసరం   లేదు.

    -మొబైల్‌ యాప్‌లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు. కేసు నమోదు చేస్తే, ఎఫ్‌ఐఆర్‌ పొందవచ్చు.

    -మహిళల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 12 మాడ్యూల్స్‌ చేర్చారు. దిశ యాప్‌ కూడా అనుసంధానం చేశారు.

    --పోలీసులే సరైన సమాచారం ఇచ్చే సోషల్‌ మీడియా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

    -దేశంలోనే తొలిసారిగా దిశ యాప్‌. ఇది ఎంతో సక్సెస్‌ అయింది. 11 లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. ఇది గర్వకారణం

    -దిశ యాప్‌ ద్వారా 568 మంది నుంచి ఫిర్యాదులు అందగా, వాటిలో 117 యఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాము.

    -సైబర్‌ సేఫ్టీ కోసం సైబర్‌మిత్ర అనే వాట్సాప్‌ నంబరు ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తెచ్చాం.

    స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ టెక్నాలజీ.

    -రాష్ట్ర పోలీసులకు అందుబాటులోకి తెచ్చి రిమోట్‌ ఏరియా కమ్యూనికేషన్లు, వాహనాలకు జీపీఎస్, శాటిలైట్‌ ఫోన్ల వ్యవస్థ ఏర్పాటు చేశాం.

    -న్యాయ ప్రక్రియలో కేసులు త్వరగా పరిష్కారమయ్యే విధంగా గత నెలలోనే ‘ఇంటర్‌- ఆపరబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్‌’.

    -ఆన్‌లైన్‌లోనే ఎఫ్‌ఐఆర్, ఛార్జ్‌షీట్లు పంపిస్తున్నారు. దీని ద్వారా కేసుల విచారణ వేగంగా జరుగుతుంది.

    -చాలా సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్‌ ద్వారా పొందవచ్చు.

  • Visakha updates: సింహాచలం లో భక్తులకు ఇవాళ నుండి ప్రత్యక్ష పద్దతిలో పూజల్లో పాల్గొనే అవకాశం..
    21 Sep 2020 10:19 AM GMT

    Visakha updates: సింహాచలం లో భక్తులకు ఇవాళ నుండి ప్రత్యక్ష పద్దతిలో పూజల్లో పాల్గొనే అవకాశం..

    విశాఖ..

    -కోవిడ్ నిబంధనలు పాటిస్తు పరిమిత సంఖ్యలో అనుమతి

    -ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనానికి అనుమతి

  • 21 Sep 2020 10:13 AM GMT

    AP Congress Core Committee Meeting: ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరభవన్ లో ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..

    ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం..

    -హజరుకానున్న మాజి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇంచార్జీ ఉమించాంది , ఏపీసీసీ ప్రెసిడెంట్ శైలజానాథ్ , ఇతర పార్టీ సీనియర్ నేతల.

    -చాలా రోజుల తరువాత పార్టీ మీటింగ్ కి హాజరవుతున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.











  • Rajahmundry updates: ముద్రగడ నాయకత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుంది..ఏపీ కాపు జేఏసీ నేతలు..
    21 Sep 2020 10:08 AM GMT

    Rajahmundry updates: ముద్రగడ నాయకత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుంది..ఏపీ కాపు జేఏసీ నేతలు..

    తూర్పుగోదావరి -రాజమండ్రి..

    ఏపీ కాపు జేఏసీ నేతలు మీడియా సమావేశం

    రాష్ట్ర కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ , ఆరేటి ప్రకాష్, చినిమిల్లి రాయుడు కామెంట్స్ ,,

    -ముద్రగడ నాయకత్వంలో ఐదేళ్ళు ఉద్యమం చేశాం

    -లేఖరూపంలో ముద్రగడ తన నిర్ణయం తెలిపారు

    -ముద్రగడ మనస్తాపం చెందివున్నారు

    -ఎమ్మెల్యే పదవికి రాజీనామా , జీవో 30 తేవడం, కాపు కార్పొరేషన్ ఏర్పాటు, ఐదు శాతం రిజర్వేషన్లు బిల్లు కేంద్రానికి పంపడం ముద్రగడ ఉద్యమం వల్లే

    -కాపులు ఎపుడూ ముద్రగడ ను మరచిపోరు

    -రిజర్వేషన్లు ఫలితాలు సాధన, సంక్షేమంపై ఆయన పాత్ర లేనిదే మేము లేం

    -ఏదిఏమైనా ముద్రగడ బాటలోనే నడుస్తాం

    -ప్రతిజిల్లాలో కాపు జేఏసీ సమావేశాలు నిర్వహించి మళ్ళీ ముద్రగడ ను కలుస్తాం..కాపు రిజర్వేషన్లు సాధించితీరతాం

    -ముద్రగడ పద్మనాభం మనస్థాపం చెంది ఆయనను బుజ్జగింపుపైనే దృష్టి పెట్టాం

    -ముద్రగడ కు అండగా వున్నామని చెప్పడానికే ఈ సమావేశం ప్రాధాన్యం

  • National updates: పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరా: అనిల్ కుమార్ యాదవ్..
    21 Sep 2020 10:00 AM GMT

    National updates: పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కోరా: అనిల్ కుమార్ యాదవ్..

    జాతీయం..

    -కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ను కలిసిన రాష్ట్ర మంత్రి అనిల్ యాదవ్, ఎంపీలు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, లావు కృష్ణదేవరాయలు

    -పోలవరం బకాయిలు, పునరావాసం ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని వినతి

    అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి..

    - రెండు మూడు రోజుల్లోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు

    - వరదల సమయంలో నూ పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారు

    - 2021 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం

    - పునరావాసం ప్యాకేజీని త్వరితగతిన సెటిల్ చేయాలి

    - నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు విడుదల చేస్తామన్నారు

    - కృష్ణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను వివరించాను

    - అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు

    - ఈ అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చు

  • Guntur updates: గుంటూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి....అగ్రికల్చర్ జేడీ విజయభారతి....
    21 Sep 2020 8:57 AM GMT

    Guntur updates: గుంటూరు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి....అగ్రికల్చర్ జేడీ విజయభారతి....

    గుంటూరు...

    -హెచ్ఎంటివి తో గుంటూరు అగ్రికల్చర్ జేడీ విజయభారతి....

    -జిల్లాలో ప్రత్తి,మిరప,వరి,పసుపు పంటలు నష్టపోయాయి...

    -జిల్లాలో 9,600హెక్టార్లలో పంటలు నష్టపోయాయి.....

    -వాగులు పొంగిపొర్లడంతో పంటలకు నష్టం జరిగింది....

    -రైతులను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది....

  • 21 Sep 2020 8:47 AM GMT

    East Godavari updates: రాజోలు గాంధీ బొమ్మ సెంటర్ లో ఆందోళన చేపట్టిన బిజెపి యువమోర్చా సభ్యులు..

    తూర్పు గోదావరిజిల్లా.... రాజోలు..

    -హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ని బర్తరఫ్ చేయాలంటూ ఆందోళన చేపట్టి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన   యువ మోర్చా సభ్యులు.

    -మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో మండిపడ్డా బీజేపీ యువ మోర్చా సభ్యులు.

    -150 కేజీల బరువున్న నాని ఒంట్లో నుంచి రెండు కేజీలు తీసేస్తే వాడికి ఏమైనా నష్టమా అంటూ మండిపడ్డారు

    -ఆందోళన చేస్తున్న యువ మోర్చా సభ్యులను అడ్డుకున్న పోలీసులు.

  • East Godavari updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు
    21 Sep 2020 8:27 AM GMT

    East Godavari updates: అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు

    తూర్పుగోదావరి..

    -అంతర్వేది లక్ష్మీనరసింహాస్వామి ఆలయం లో

    -ఈనెల 25 వరకు భక్తులకు మళ్ళీ దర్శనములు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన ఆలయ అధికారులు

    -కరోనా వ్యాప్తి నివారణ, పోలీసు బందోబస్తు నేపధ్యంలో తాజా నిర్ణయం తీసుకున్న అధికారులు

    -ఉదయాన్నే దర్శనాలకు అనుమతించినా ఆలయానికి రాని భక్తులు

  • Amaravati updates: రైతును..రాజును, పారిశ్రామిక వేత్తను చెయ్యడమే బీజేపీ పరిపాలనా ఉద్దేశం: సోము వీర్రాజు..
    21 Sep 2020 7:11 AM GMT

    Amaravati updates: రైతును..రాజును, పారిశ్రామిక వేత్తను చెయ్యడమే బీజేపీ పరిపాలనా ఉద్దేశం: సోము వీర్రాజు..

    అమరావతి...

    -సోము వీర్రాజు...ఏపీ బీజేపీ అధ్యక్షుడు..

    -ఇదే ఉద్దేశం తో రైతుల బిల్ ప్రవేశ పెట్టాము..

    -భారత దేశం లో రైతు పండించే పంట కు గిట్టుబాటు ధర లేదు..

    -రైతు కూడా తన పంట ఎక్కడైనా అమ్ముకోవాలి...

    -ఏ రకమైన అడ్డంకులు ఉండకూడదు.

    -ఇప్పటివరకు దేశంలో దళారి వ్యవస్థ మూలంగా రైతులు నష్టపోయారు.

    -మంత్రి కొడాలి నాని ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టం లేదంటున్నారు.

    -ఏంటి..ఈ భాష, ఇది సభ్యత కాదు.

    -ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి భాష మాట్లాడించడం మంచిది కాదు...

    -బీజేపీ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది..

    -సరైన భాష మాట్లాడడానికి కూడా చట్టబద్ధత ఉండాలి....

  • Amaravati updates: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక-కె.కన్నబాబు..
    21 Sep 2020 7:01 AM GMT

    Amaravati updates: కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక-కె.కన్నబాబు..

    పిడుగు హెచ్చరిక..

    కృష్ణా జిల్లా..

    *కె.కన్నబాబు, విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్*

    -నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం.

    తూర్పుగోదావరి జిల్లా..

    -రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం

    -మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.

    -పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి.

    -సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

Print Article
Next Story
More Stories