Live Updates: ఈరోజు (19 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 19 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు సోమవారం | 19 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | తదియ సా.06-47 వరకు తదుపరి చవితి | విశాఖ నక్షత్రం రా.11-04 వరకు తదుపరి అనురాధ | వర్జ్యం: మ.02-49 నుంచి 04-19 వరకు | అమృత ఘడియలు రా.11-50 నుంచి 12-47 వరకు | దుర్ముహూర్తం: మ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ. 02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-35
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 19 Oct 2020 8:30 AM IST
కామారెడ్డి :జుక్కల్.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద.
8గేట్లను ఎత్తివేసి నీటిని దిగువస్థాయి కి విడుదల.
ఇన్ ప్లో 66274క్యూసెక్కులు.
ఔట్ ప్లో 59712క్యూసెక్కులు.
పూర్తి స్థాయి నీటి మట్టం. 1405అడుగులు కాగ.
ప్రస్తుతం 1404.68.క్యూసెక్కులు.
ప్రాజెక్ట్ సామర్ధ్యం. 17.802.టి ఎం సి లు.
17.. 340టి ఎం సి లు.
- 19 Oct 2020 8:29 AM IST
నిర్మల్ జిల్లా లోని బాసర క్షేత్రం లో దసరా నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజైన నేడు చంద్ర ఘంటా దేవి అలంకారం లో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ...అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యం గా సమర్పించిన ఆలయ పూజారులు .



