Live Updates: ఈరోజు (17 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 17 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

K V D Varma
Updated on: 17 Oct 2020 9:14 PM IST

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం | 17 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | పాడ్యమి రా.11-29 వరకు తదుపరి విదియ | చిత్త నక్షత్రం మ.02-23 వరకు తదుపరి స్వాతి | వర్జ్యం: రా.07-35 నుంచి 09-05 వరకు | అమృత ఘడియలు ఉ.08-25 నుంచి 09-55 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-57 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.19-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.05-57 | సూర్యాస్తమయం: సా.05-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates

  • 17 Oct 2020 11:36 AM IST

    నాగర్ కర్నూల్ జిల్లా : కొల్లాపూర్ మండలం ఎల్లూరు లో నీటమునిగిన కెఎల్ఐ ప్రాజెక్ట్ పంపు మోటర్లను కవర్ చెయ్యకుండా మీడియాను అడ్డుకుంటున్న పోలీసులు.

    కేఎల్ఐ వద్ద జర్నలిస్టుల ఆందోళన.

  • 17 Oct 2020 11:35 AM IST

    నాగర్ కర్నూల్ జిల్లా

    తెలకపల్లి వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి నీ అడ్డుకున్న పోలీసులు.

    నీట మునిగిన కే ఎల్ ఐ మోటార్లను చూడటానికి వెళ్తున్నా రేవంత్ రెడ్డి నీ తెలకపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

  • 17 Oct 2020 10:35 AM IST

    ప్రభుత్వానికి ఎల్​ఆర్​స్​ దరఖాస్తుల వెల్లువ కొనసాగుతున్నది.

    రాష్ట్రంలో ఇప్పటి వరకు 20 లక్షలకుపైగా దరఖాస్తులు

    గ్రామ పంచాయితీల నుంచి 8 లక్షల 33 వేల ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు

    మున్సిపాలిటీల నుంచి 8 లక్షల 37 వేలు,

    కార్పోరేషన్ల నుంచి

    3 లక్షల 40 వేల దరఖాస్తులు

    గడువుపొడిగించడంతో

    మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • 17 Oct 2020 10:35 AM IST

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:ఏఐటీయూసీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా గోలేటి నుండి కొత్తగూడెం వరకు సేవ్ సింగరేణి అనే నినాదంతో బస్సు యాత్ర కొత్తగూడెం జీకే ఓసీలో సభ పాల్గొన్న ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు,ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య.

  • 17 Oct 2020 10:34 AM IST

    నిజామాబాద్ : జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ అటవీ ప్రాంతం లో.. యువకుని దారుణ హత్య.

    మృతుడు వివేక్ నగర్ తండా కు చెందిన వివేక్ గా గుర్తింపు.

    మద్యం తాగించి హత్య చేసినట్లు ఆనవాళ్లు..

    హత్యకు గల కారణాల పై పోలీసుల విచారణ.

  • 17 Oct 2020 8:59 AM IST

    నిజామాబాద్..

    శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ లో యువకుడు గల్లంతు..

    మిత్రులతో కలిసి ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన నగేష్ అనే యువకుడు..

    వరద ఉదృతి నీ గమనించకుండా పోచం పాడ్ పుష్కర ఘాట్ వద్ద సరదా కోసం నీటి లో దిగిన యువకుడు..

    వరద నీటి ప్రవాహం పెరగడం తో నీటి లో మునిగిన యువకుడు..

    గల్లంతైన యువకుడి ది జక్రాన్ పల్లి మండలం మునిపల్లి గ్రామం..

  • 17 Oct 2020 8:59 AM IST

    సూర్యాపేట జిల్లా.

    పులిచింతల ప్రాజెక్టు సమాచారం...

    12 గేట్లు 5 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల..

    * ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45,77 టీఎంసీలు.

    ప్రస్తుతం నీటి నిల్వ 43,93 టీఎంసీలు

    పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు

    ప్రస్తుతం నీటి మట్టం 173,817 అడుగులు నిలువ

    * ఇన్ ప్లో: 4,45,380 క్యూసెక్కులు.

    *అవుట్ ఫ్లో: 4,45,380 క్యూసెక్కులు.

    *విద్యుత్ ఉత్పాదన ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల

  • 17 Oct 2020 8:58 AM IST

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా

    సరస్వతి బ్యారేజ్

    20 గేట్లు ఎత్తిన అధికారులు

    పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు

    ప్రస్తుత సామర్థ్యం 116.00 మీటర్లు

    పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ

    ప్రస్తుత సామర్థ్యం 5.1 టీఎంసీ

    ఇన్ ఫ్లో 1,24,000 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో 90,000 క్యూసెక్కులు

K V D Varma

K V D Varma

Next Story