Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 15 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Aug 2020 10:06 AM IST
74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని..
శ్రీకాకుళం జిల్లా:
- ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కొడాలి నాని..
- వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్..
- ఇంచార్జ్ మంత్రి కొడాలి నానికి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు..
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శకటాలను పరిశీలించిన మంత్రి..
- 15 Aug 2020 10:06 AM IST
కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు..
తూర్పుగోదావరి :
- మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్..
- ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షం.. జోరు వర్షంలో తడుస్తూనే జెండాను ఆవిష్కరించిన డిప్యూటి సిఎం ధర్మాన..
- వర్షం కారణంగా వివిధ ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు..
- కోవిడ్ కారణంగా పరిమితి సంఖ్యలో హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు..
- 15 Aug 2020 10:05 AM IST
విజయవాడ:
- ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన సిఎం జగన్, సీ ఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సావాంగ్..ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు,.వైసీపీ ముఖ్యనేతలు.
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన సిఎం జగన్
- మాస్క్ తో కార్యక్రమానికి హాజరైన సీఎం
- వర్షం కురుస్తుం టే గొడుగు పట్టబోయిన సెక్యూరిటీ ని వద్దని వర్షంలోనే వందనం స్వీకరించిన సీఎం
- 15 Aug 2020 10:04 AM IST
విశాఖ:
- పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రారంభం అయిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- పతాక ఆవిష్కరణ చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి బొత్స సత్య నారాయణ, రాజ్య సభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన.
- ప్రధాన ఆకర్షణగా నిలిచిన శకటాలు
- 15 Aug 2020 7:30 AM IST
మరికాసేపట్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
విజయవాడ:
- మరికాసేపట్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చనున్న సిఎం జగన్
- ఆ తర్వాత సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించ నున్న ముఖ్యమంత్రి
- ప్రదర్శనలో పది శకటాలు
- కరోనా నేపథ్యంలో జనాన్ని జాగృతం చేసేలా పలు కార్యక్రమాలు రూప కల్పన
- అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించ నున్న సీఎం జగన్
- కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులు
- సాధారణ ప్రజలు, స్కూల్ పిల్లలకు ప్రవేశం లేదు
- 15 Aug 2020 7:18 AM IST
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
కర్నూలు జిల్లా:
- ఇన్ ఫ్లో : 1,65,746 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 42,378 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 867.70 అడుగులు
- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు
- ప్రస్తుతం : 132.4436 టిఎంసీలు
- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 15 Aug 2020 7:17 AM IST
కనిగిరి- చెన్నై పీడీస్ బియ్యం అక్రమ రవాణా..
నెల్లూరు:
- కనిగిరి- చెన్నై పీడీస్ బియ్యం అక్రమ రవాణా..
- వింజమూరు బంగ్లా సెంటర్ వద్ద రెండు లారీలు స్వాధీనం చేసిన పోలీసులు.
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుండి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.
- నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపినఎస్సై బాజిరెడ్డి
- 15 Aug 2020 7:16 AM IST
విజయవాడ:
- రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
- కరోనా మహమ్మారిపై మానవాళి త్వరలోనే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు
- శాంతి, అహింస, సంఘీభావం, సోదరభావాన్ని పాటిస్తూ దేశ పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు
- కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సామాజికదూరం పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు
- 15 Aug 2020 7:15 AM IST
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..
విశాఖ:
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం....
- నేటి సాయంత్రం కు తీవ్ర అల్పపీడనం గా మారే అవకాశం..
- మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర లో భారీ వర్షాలు
- తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు
- సముద్రం అలజడి గా వుంటుంది
- మత్స్యకారులు కు కొనసాగుతున్న హెచ్చరికలు...




