Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 15 Aug 2020 4:36 AM GMT
74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని..
శ్రీకాకుళం జిల్లా:
- ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కొడాలి నాని..
- వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్..
- ఇంచార్జ్ మంత్రి కొడాలి నానికి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు..
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శకటాలను పరిశీలించిన మంత్రి..
- 15 Aug 2020 4:36 AM GMT
కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు..
తూర్పుగోదావరి :
- మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్..
- ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షం.. జోరు వర్షంలో తడుస్తూనే జెండాను ఆవిష్కరించిన డిప్యూటి సిఎం ధర్మాన..
- వర్షం కారణంగా వివిధ ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు..
- కోవిడ్ కారణంగా పరిమితి సంఖ్యలో హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు..
- 15 Aug 2020 4:35 AM GMT
విజయవాడ:
- ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన సిఎం జగన్, సీ ఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సావాంగ్..ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు,.వైసీపీ ముఖ్యనేతలు.
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన సిఎం జగన్
- మాస్క్ తో కార్యక్రమానికి హాజరైన సీఎం
- వర్షం కురుస్తుం టే గొడుగు పట్టబోయిన సెక్యూరిటీ ని వద్దని వర్షంలోనే వందనం స్వీకరించిన సీఎం
- 15 Aug 2020 4:34 AM GMT
విశాఖ:
- పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రారంభం అయిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- పతాక ఆవిష్కరణ చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్
- స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి బొత్స సత్య నారాయణ, రాజ్య సభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన.
- ప్రధాన ఆకర్షణగా నిలిచిన శకటాలు
- 15 Aug 2020 2:00 AM GMT
మరికాసేపట్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
విజయవాడ:
- మరికాసేపట్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చనున్న సిఎం జగన్
- ఆ తర్వాత సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించ నున్న ముఖ్యమంత్రి
- ప్రదర్శనలో పది శకటాలు
- కరోనా నేపథ్యంలో జనాన్ని జాగృతం చేసేలా పలు కార్యక్రమాలు రూప కల్పన
- అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించ నున్న సీఎం జగన్
- కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులు
- సాధారణ ప్రజలు, స్కూల్ పిల్లలకు ప్రవేశం లేదు
- 15 Aug 2020 1:48 AM GMT
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
కర్నూలు జిల్లా:
- ఇన్ ఫ్లో : 1,65,746 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 42,378 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
- ప్రస్తుతం : 867.70 అడుగులు
- నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు
- ప్రస్తుతం : 132.4436 టిఎంసీలు
- ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
- 15 Aug 2020 1:47 AM GMT
కనిగిరి- చెన్నై పీడీస్ బియ్యం అక్రమ రవాణా..
నెల్లూరు:
- కనిగిరి- చెన్నై పీడీస్ బియ్యం అక్రమ రవాణా..
- వింజమూరు బంగ్లా సెంటర్ వద్ద రెండు లారీలు స్వాధీనం చేసిన పోలీసులు.
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుండి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.
- నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపినఎస్సై బాజిరెడ్డి
- 15 Aug 2020 1:46 AM GMT
విజయవాడ:
- రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు
- కరోనా మహమ్మారిపై మానవాళి త్వరలోనే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు
- శాంతి, అహింస, సంఘీభావం, సోదరభావాన్ని పాటిస్తూ దేశ పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు
- కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు
- బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సామాజికదూరం పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు
- 15 Aug 2020 1:45 AM GMT
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..
విశాఖ:
- బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం....
- నేటి సాయంత్రం కు తీవ్ర అల్పపీడనం గా మారే అవకాశం..
- మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర లో భారీ వర్షాలు
- తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు
- సముద్రం అలజడి గా వుంటుంది
- మత్స్యకారులు కు కొనసాగుతున్న హెచ్చరికలు...

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




