Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు శనివారం, 15 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం ఏకాదశి(ఉ. 11-01వరకు) తదుపరి ద్వాదశి ; ఆర్ద్ర నక్షత్రం (తె. 5-18 వరకు) తదుపరి పునర్వసు నక్షత్రం, అమృత ఘడియలు (సా0.6-56 నుంచి 08-36 వరకు), వర్జ్యం (మ.01-08 నుంచి 02-48 వరకు) దుర్ముహూర్తం (ఉ. 05-46 నుంచి 07-26 వరకు) రాహుకాలం (ఉ.09-00 నుంచి 10-30 వరకు) సూర్యోదయం ఉ.05-46 సూర్యాస్తమయం సా.06-23

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 15 Aug 2020 4:36 AM GMT

    74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని..

    శ్రీకాకుళం జిల్లా:

    - ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకున్న జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కొడాలి నాని..

    - వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్..

    - ఇంచార్జ్ మంత్రి కొడాలి నానికి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు..

    - స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శకటాలను పరిశీలించిన మంత్రి..

  • 15 Aug 2020 4:36 AM GMT

    కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా 74 వ స్వాతంత్ర్య దినోత్సన వేడుకలు..

    తూర్పుగోదావరి :

    - మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్..

    - ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షం.. జోరు వర్షంలో తడుస్తూనే జెండాను ఆవిష్కరించిన డిప్యూటి సిఎం ధర్మాన..

    - వర్షం కారణంగా వివిధ ప్రభుత్వశాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు..

    - కోవిడ్ కారణంగా పరిమితి సంఖ్యలో హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు..

  • 15 Aug 2020 4:35 AM GMT

    విజయవాడ: 

    - ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైన సిఎం జగన్, సీ ఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సావాంగ్..ఇతర ఉన్నతాధికారులు, పలువురు మంత్రులు,.వైసీపీ ముఖ్యనేతలు.

    - జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించిన సిఎం జగన్

    - మాస్క్ తో కార్యక్రమానికి హాజరైన సీఎం

    - వర్షం కురుస్తుం టే గొడుగు పట్టబోయిన సెక్యూరిటీ ని వద్దని వర్షంలోనే వందనం స్వీకరించిన సీఎం

  • 15 Aug 2020 4:34 AM GMT

    విశాఖ:

    - పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా ప్రారంభం అయిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    - పతాక ఆవిష్కరణ చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్

    - స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి బొత్స సత్య నారాయణ, రాజ్య సభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ, కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన.

    - ప్రధాన ఆకర్షణగా నిలిచిన శకటాలు

  • 15 Aug 2020 2:00 AM GMT

    మరికాసేపట్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    విజయవాడ:

    - మరికాసేపట్లో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    - జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చనున్న సిఎం జగన్

    - ఆ తర్వాత సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించ నున్న ముఖ్యమంత్రి

    - ప్రదర్శనలో పది శకటాలు

    - కరోనా నేపథ్యంలో జనాన్ని జాగృతం చేసేలా పలు కార్యక్రమాలు రూప కల్పన

    - అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించ నున్న సీఎం జగన్

    - కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులు

    - సాధారణ ప్రజలు, స్కూల్ పిల్లలకు ప్రవేశం లేదు

  • 15 Aug 2020 1:48 AM GMT

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి

    కర్నూలు జిల్లా:

    - ఇన్ ఫ్లో : 1,65,746 క్యూసెక్కులు

    - ఔట్ ఫ్లో : 42,378 క్యూసెక్కులు

    - పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు

    - ప్రస్తుతం : 867.70 అడుగులు

    - నీటి నిలువ సామర్థ్యం : 215.807 టిఎంసీలు

    - ప్రస్తుతం : 132.4436 టిఎంసీలు

    - ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 15 Aug 2020 1:47 AM GMT

    కనిగిరి- చెన్నై పీడీస్ బియ్యం అక్రమ రవాణా..

    నెల్లూరు: 

    - కనిగిరి- చెన్నై పీడీస్ బియ్యం అక్రమ రవాణా..

    - వింజమూరు బంగ్లా సెంటర్ వద్ద రెండు లారీలు స్వాధీనం చేసిన పోలీసులు.

    - ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుండి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.

    - నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపినఎస్సై బాజిరెడ్డి

  • 15 Aug 2020 1:46 AM GMT

    విజయవాడ:

    - రాష్ట్ర ప్రజలకు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

    - కరోనా మహమ్మారిపై మానవాళి త్వరలోనే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు

    - శాంతి, అహింస, సంఘీభావం, సోదరభావాన్ని పాటిస్తూ దేశ పురోభివృద్ధికి పాటుపడాలని కోరారు

    - కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు

    - బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సామాజికదూరం పాటించాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు

  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..
    15 Aug 2020 1:45 AM GMT

    బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం..

    విశాఖ:

    - బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం....

    - నేటి సాయంత్రం కు తీవ్ర అల్పపీడనం గా మారే అవకాశం..

    - మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర లో భారీ వర్షాలు

    - తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు

    - సముద్రం అలజడి గా వుంటుంది

    - మత్స్యకారులు కు కొనసాగుతున్న హెచ్చరికలు...

Print Article
Next Story
More Stories