Live Updates: ఈరోజు (సెప్టెంబర్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 10 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | భాద్రపద మాసం | కృష్ణపక్షం | అష్టమి (రా.10-36 వరకు) తదుపరి నవమి | రోహిణి నక్షత్రం (ఉ. 10-28 వరకు) తదుపరి మృగశిర | అమృత ఘడియలు: ఉ.7-01 నుంచి 8-44 వరకు తిరిగి తె. 2-35 నుంచి 4-16 వరకు | వర్జ్యం: సా. 4-24 నుంచి 6-05 వరకు | దుర్ముహూర్తం: ఉ. 9-55 నుంచి 10-44 వరకు తిరిగి మ. 2-49 నుంచి 3-38 వరకు | రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.5-50 | సూర్యాస్తమయం: సా.6-05

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 10 Sep 2020 5:57 AM GMT

    Visakha updates: ఏపి సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి కామెంట్స్..

    విశాఖ..

    -ఏపిలో రాక్షస పాలన చూస్తున్నారు.

    -దేవాలయ సంప్రదాయాలు మంటకలుపుతున్నారు.

    -అంతర్వేదిలో దగ్దం అయ్యింది కేవలం స్వామి వారి రథంకాదు,

    -5 కోట్ల ప్రజలమానోరథాలను దగ్దం చేశారు.

    -హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.

    -దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి.

    -సింహాచలం దేవస్థానం గెస్ట్ హౌస్ లో అజ్ఞాత వ్యక్తి బస చేయడానికి కారణం ఏంటి?

    -క్రైస్తవ సంస్ధలు కొన్ని కుట్రతో హిందూధర్మాన్ని తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి.

    -అంతర్వేది రథం దగ్దం ఉదంతం పై కేంద్రం దృష్టికి తీసుకు వెళతాం

  • 10 Sep 2020 3:43 AM GMT

    Andhra Pradesh updates: నేటి నుంచి ఏపీలో ప్రవేశ పరీక్షలు ప్రారంభం..

    -నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ ఐసెట్ 2020

    -ఏపీలో ఐసెట్ పరీక్ష రాయనున్న 64884 మంది విద్యార్థులు

    -ఏపీలో 75 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్ లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

    -ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు మొదటి సెషన్

    -మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు రెండో సెషన్

    -అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన

    -కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

    -కరోనా లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేక ఐసోలేషన్ లో పరీక్ష రాసే అవకాశం

    -ప్రతి ఒక్క విద్యార్థి కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.

  • 10 Sep 2020 3:40 AM GMT

    East Godavari updates: పిఠాపురం-గొల్లప్రోలు లో విషాదఛాయలు.. స్వస్థలానికి చేరుకున్న బుల్లితెర నటి శ్రావణి మృతదేహం..

    తూర్పుగోదావరి :

    -శ్రావణి మృతదేహంతో స్వగ్రామానికి చేరుకున్న శ్రావణి తల్లిదండ్రులు, తమ్ముడు

    -మృతదేహం వెంట వచ్చిన సాయి అనే యువకుడు..

    -శోక సంద్రంలో మునిగిపోయిన కుటుంబసభ్యులు, బంధువులు..

    -గొల్లప్రోలులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోన్న కుటుంబసభ్యులు..

    -సాయి మా కుటుంబ సభ్యుడు మాకు ఆప్తుడు.. అతనే మాకు అండగా నిలిచాడు.. శ్రావణి కుటుంబసభ్యులు..

  • 10 Sep 2020 2:08 AM GMT

    Andhra university: ఈ నెల 13 న జరగాల్సిన బీఏ, బీ.కామ్, కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా

    విశాఖ..

    - ఆంధ్రా యునివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 13 న జరగాల్సిన బీఏ, బీ.కామ్, కామన్ ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా...

    - కోవిడ్ కారణంగా పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఏయూ

  • Visakhapatnam Updates: 16 వ జాతీయ రహదారిపై వరాహ నదిలో పడి పోయిన ప్రయివేట్ బస్సు
    10 Sep 2020 12:46 AM GMT

    Visakhapatnam Updates: 16 వ జాతీయ రహదారిపై వరాహ నదిలో పడి పోయిన ప్రయివేట్ బస్సు

    విశాఖ :

    - ఎస్ రాయవరం మండలం పెనుగొల్లు వద్ద 16 వ జాతీయ రహదారిపై వరాహ నదిలో పడి పోయిన ప్రయివేట్ బస్సు .

    - తమిళనాడుకి చెందిన ఈ బస్సు చెన్నై నుండి విశాఖ వెళ్తుండగా ప్రమాదవ శాత్తు 30 అడుగుల ఎత్తు నుండి నదిలో పడి పోయింది.

    - బస్సులో కేవలం 3 గురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలు ,

    - మరో ఇద్దరికి స్వల్ప గాయాలు. గాయపడ్డ వారిని నక్కపల్లి ఆసుపత్రికి తరలింపు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.

  • Nellore Updates: నేడు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర
    10 Sep 2020 12:41 AM GMT

    Nellore Updates: నేడు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర

    నెల్లూరు:

    - ఆలయ చరిత్రలో తొలిసారిగా భక్తులు లేకుండా అమ్మవారి జాతర.

    - కరోనా నేపథ్యంలో భక్తులపై కఠిన ఆంక్షలు.

    - దర్శనాలు రద్దు. ఇతరులెవరూ వెంకటగిరి కి రావద్దు అంటూ పోలీసుల నిషేధాజ్ఞలు.

Print Article
Next Story
More Stories