Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 10 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అష్టమి మ.12-29 వరకు తదుపరి నవమి | పునర్వసు నక్షత్రం రా.08-58 వరకు తదుపరి పుష్యమి| వర్జ్యం: ఉ.08-41 నుంచి 10-19 వరకు తిరిగి తే.5-51 నుంచి 5-55 వరకు | అమృత ఘడియలు సా.06-31నుంచి 07-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-20వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Oct 2020 10:23 AM IST
మహబూబాబాద్ జిల్లా.
నేడు జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.
1. ఉదయం 9 గంటలకు మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ లో అంబులెన్స్ ప్రారంభం, నూతన కోవిడ్ బ్లాక్ కు శంకుస్థాపన.
2. ఉదయం 9.30 గంటలకు నర్సంపేట బైపాస్ రోడ్డులో సఖీ కేంద్రానికి శంకుస్థాపన.
3. ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ సిగ్నల్ కాలనీలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ నిర్మాణానికి శంకుస్థాపన.
4. ఉదయం 10.30 గంటలకు మహబూబాబాద్ , పద్మశాలి భవన్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం.
- 10 Oct 2020 10:23 AM IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సరస్వతి బ్యారేజ్
12 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 119.00 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 118.00 మీటర్లు
పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 8.54 టీఎంసీ
ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 27,000 క్యూసెక్కులు
- 10 Oct 2020 10:23 AM IST
మంత్రి ఈటెల రాజేందర్... వైద్య శాఖ మంత్రి
గ్రేస్ కాన్సర్ రన్ 2020 లో పాల్గొనడం నా కర్తవ్యం గా భావిస్తున్నాను
అవగాహన తోనే అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తాయి
కాన్సర్ నియంత్రణ కోసం చాలా కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాం
కాన్సర్ ను ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు
తెలంగాణ ప్రభుత్వం స్వచ్చంద సంస్థలను ప్రోత్సహిస్తుంది
పేదవారు ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది
- 10 Oct 2020 10:22 AM IST
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో గ్రేస్ కాన్సర్ రన్ 2020 ని ప్రారంభం చేసిన సిపి సజ్ఞానార్
సజ్జనార్ ...సైబరాబాద్ సీపీ
120 దేశాల్లో వర్చువల్ రన్ లో పాల్గొంటారున్నారు
లక్ష మందికి పైగా ఈ రన్ లో పాల్గొంటున్నారు
ప్రస్తుతం అందరం కోవిడ్ పై పోరాటం చేస్తున్నాం
కోవిడ్ మీదనే కాదు కాన్సర్ పైకూడా పోరాడాలి
3 సంవత్సరాల నుంచి కాన్సర్ పై కొంత అవేర్నెస్ పెరిగింది
ఇలాంటి రన్స్ లో పాల్గొనడం ద్వారా మరింత అవగాహన పెరుగుతుంది
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఈ వర్చువల్ రన్ నమోదు అవబోతుంది



