Live Updates: ఈరోజు (10 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 10 అక్టోబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 10 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | అష్టమి మ.12-29 వరకు తదుపరి నవమి | పునర్వసు నక్షత్రం రా.08-58 వరకు తదుపరి పుష్యమి| వర్జ్యం: ఉ.08-41 నుంచి 10-19 వరకు తిరిగి తే.5-51 నుంచి 5-55 వరకు | అమృత ఘడియలు సా.06-31నుంచి 07-42 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-20వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 10 Oct 2020 10:22 AM IST
గుంటూరుజిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ వద్ద ట్యాంకర్ నుంచి లీకైన హైడ్రోక్లోరిక్ యాసిడ్
నరసరావుపేట నుంచి విశాఖపట్నం వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్
లీకైన ట్యాంకర్ నుంచి మరొక ట్యాంకర్ లోకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ను పంపాలని నిర్ణయించిన అధికారులు
- 10 Oct 2020 10:21 AM IST
విజయవాడ
పొంచి ఉన్న భారీ తూఫాన్
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
మరో రెండు రోజులు ఏపీ కోస్తాప్రాంతం అంతా కురవనున్న వర్షాలు
రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం
లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి
రెవెన్యూ, ఫైర్, రక్షణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
తీర ప్రాంతాల జాలర్లు వేటకు వెళ్ళరాదు
- 10 Oct 2020 10:21 AM IST
తిరుమల
కాలినడకన తిరుమలకు చేరుకున్న టీటీడీ నూతన ఈవో జవహార్ రెడ్డి
శ్రీవారి దర్శనానంతరం 11:30 నుంచి 12 గంటల మద్య ఆలయంలో బాధ్యతలు స్వీకరించనున్న జవహార్ రెడ్డి
అనంతరం వివిధ విభాగాల అధికారులతో అన్నమయ్య భవనంలో సమావేశం
- 10 Oct 2020 10:20 AM IST
తిరుపతి
ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సియం జగన్ ఫోన్
ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఫోన్ లో పరామర్శించి జాగ్రత్తలు సూచించిన సియం
రెండవ సారి కోవిడ్ సోకి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూమన - 10 Oct 2020 10:20 AM IST
తిరుమల
శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం
పన్నీర్ సెల్వం.
పన్నీరు సెల్వంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రులు వేలుమణి, సంపత్, సరోజా
స్వామి వారి దర్శనంతరం ఆలయ పెద్ద జీయ్యంగార్ల ఆశీర్వాదం పోందిన పన్నీరు సెల్వం.
- 10 Oct 2020 10:19 AM IST
అమరావతి
దసరా సందర్భంగానైనా ఆంధ్ర, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలి
కోవిద్-19 కారణంగా 6 నెలలకు పైగా అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులు నిలిపి వేయడం జరిగింది.
లాక్ డౌన్ సడలింపుల తదుపరి ఆంధ్ర, తెలంగాణల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు 5 దఫాలుగా అధికారుల మధ్య జరిగిన చర్చలు ఫలితం ఇవ్వలేదు.
ఆంధ్ర, తెలంగాణల మధ్య ఆర్టీసీ సర్వీసులు లేకపోవడం ప్రైవేట్ ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చేదిగా ఉంది.
👆రామకృష్ణ.
- 10 Oct 2020 10:19 AM IST
తిరుమల
అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు నడచి వెళుతున్న టీటీడీ నూతన ఈవో కె ఎస్ జవహర్ రెడ్డి
ఇవాళ ఉదయం 11.30 నుంచి 12 గంటల మధ్య శ్రీవారి ఆలయంలో ఈవోగా భాద్యతలు స్వీకరిస్తారు..
- 10 Oct 2020 8:53 AM IST
Tirumala: తిరుమల సమాచారం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 16,130 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 5,821 మంది భక్తులు
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.45 కోట్లు
శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం.
- పన్నీరు సెల్వంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు మంత్రులు వేలుమణి, సంపత్, సరోజా
- స్వామి వారి దర్శనంతరం ఆలయ పెద్ద జీయ్యంగార్ల ఆశీర్వాదం పోందిన పన్నీరు సెల్వం.




