Live Updates: ఈరోజు (09 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 09 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శుక్రవారం | 09 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | సప్తమి ఉ.12-22 వరకు తదుపరి షష్టి | ఆర్ద్ర నక్షత్రం రా.08-24 వరకు తదుపరి పునర్వసు | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు ఉ.09-56 నుంచి 10-53 వరకు | దుర్ముహూర్తం: ఉ.08-15 నుంచి 09-02 వరకు తిరిగి మ.12-09 నుంచి 12-56 వరకు | రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 9 Oct 2020 8:24 AM IST
Ranga Reddy updates: అవుటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి...
రంగారెడ్డి జిల్లా...
-మద్యం మత్తులో కారు డ్రైవర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.
-నగర శివారులోని నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున రెండు కార్లు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా ఆరు మందికి తీవ్ర గాయాలు.
-శంషాబాద్ నుండి గచ్చిబౌలి వెళుతున్న సమయంలో నార్సింగి ఫ్లైఓవర్ కింద ఈ ఘటన..
-భారీగా ట్రాఫిక్ జామ్
-సంఘటన స్థలానికి చేరుకున్న ORR ట్రాఫిక్ పోలీసులు.
-గాయపడినవారిని గచ్చిబౌలి ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు..
-హయత్ నగర్ వద్ద మద్యం సేవించినట్లు యువకులు...
-వీరంతా సూర్యాపేటకు చెందిన గుర్తించిన నార్సింగి పోలీసులు..
-మద్యం సేవించిన వ్యక్తులు మాత్రమే మరణించడం గమనార్హం
- 9 Oct 2020 8:20 AM IST
Nizamabad updates: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న విప్ గంప గోవర్దన్...
నిజామాబాద్..
-ఎల్లారెడ్డి లో ఎమ్మెల్యే జాజుల సురేందర్, బోధన్ లో షకీల్
-ఈ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకొని రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్..
-ఇంకా ఓటు రాని రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి..
-జుక్కల్ లో మున్సిపాలిటీ లేనందున జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే కు లేని ఓటు
- 9 Oct 2020 8:15 AM IST
Nizamabad updates: ఎమ్మెల్సీ బరిలో సీఎం కల్వకుంట్ల కవిత..
నిజామాబాద్..
-నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి వడ్డే పల్లి సుభాష్ రెడ్డి, బీజేపీ పోతన్ కర్ లక్ష్మీనారాయణ పోటీ
-బాన్సువాడ లో ఓటు వేయనున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, భీంగల్ లో ఓటు వేయనున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
-నిజామాబాద్ జడ్పీ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, జీవన్ రెడ్డి , ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీలు ఆకుల లలిత, vg గౌడ్, రాజేశ్వర్ లు ..
-నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా 67 ఓట్లు ఉన్నది జడ్పీ కార్యాలయ కేంద్రం, తక్కువ ఓటర్లు ఉన్న కేంద్రం చందూర్ 4
- 9 Oct 2020 8:07 AM IST
Karimnagar district updates: హుజురాబాద్ మిషన్ భగీరథ స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం...
కరీంనగర్ జిల్లా...
-షాట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం. ఎగిసిపడుతున్న మంటలు.
-2 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని అధికారుల అంచనా.
-మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
- 9 Oct 2020 7:56 AM IST
Telangana updates: రెండు సెషన్లలో పరీక్ష రాయనున్న అభ్యర్థులు...
-నేడు TS LAWCET & PGLCET 2020 పరీక్ష
-రెండు సెషన్లలో పరీక్ష రాయనున్న 30,310 అభ్యర్థులు
-3 ఇయర్స్ డిగ్రీ కోర్సుకు నమోదు చేసుకున్న 21,925 మంది అభ్యర్థులు
-ఎల్ఎల్కు హాజరు కావడానికి5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కోర్సుకు నమోదు చేసుకున్న 569,1 మంది అభ్యర్థులు
-ఎల్ ఎల్ ఎం కు 2691 మంది అభ్యర్థులు
-టిఎస్ లాసెట్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్సు
-ఉదయం 10.30 నుండి ఎల్ 12 మధ్యాహ్నం వరకు..
-టిఎస్ లాసెట్ 5 సంవత్సరాల డిగ్రీ కోర్సు & టిఎస్ పిసిఎల్సిఇటి మధ్యాహ్నం 03.00 PM నుండి 04:30PM వరకు
-మొత్తం 67 టెస్ట్ సెంటర్లు...
-తెలంగాణలో 63, ఆంధ్రప్రదేశ్ లో 04





