Live Updates:ఈరోజు (ఆగస్ట్-06) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం, 06 ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం తదియ(రాత్రి 12-15 వరకు) తదుపరి చవితి; శతభిష నక్షత్రం (ఉ.11-18 వరకు) తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 6-18 నుంచి 8-03 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 01-30 నుంచి 03-00 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-29

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 6 Aug 2020 2:17 PM GMT

    కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డి

    కడప :

    - కడప కేంద్ర కారాగారం నుంచి విడుదలైన తాడిపత్రి టిడిపి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు అస్మిత్ రెడ్డి

    - జైలు నుంచి బయటకు వచ్చి తాడిపత్రికి పయనం

    - తాడిపత్రి నుంచి భారీగా తరలివచ్చిన టిడిపి కార్యకర్తలు

  • 6 Aug 2020 2:16 PM GMT

    సినీ నటులు చిరంజీవి తో భేటీ అయిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్ రాజు..

    - మాజీ కేంద్ర మంత్రులు ప్రముఖ సినీ నటులు చిరంజీవి తో భేటీ అయిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్ రాజు.

    - మర్యాద పూర్వక భేటీ అంటున్న బీజేపీ నేతలు.

    - సోము వీర్రాజు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి.

    - బిజెపి జనసేన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ ,సహకారంతో వీర్రాజు ముందుకెళ్లాలని చిరంజీవి ఆకాంక్షించారు.

  • 6 Aug 2020 2:15 PM GMT

    ఉన్నత విద్యపై సిఎం జగన్ సమీక్ష చేశారు: మంత్రి ఆదిమూలపు సురేష్

    అమరావతి:

    - విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

    - ఉన్నత విద్యపై సిఎం జగన్ సమీక్ష చేశారు.

    - నూతన జాతీయ విద్యా విధానం వచ్చాక ఎలా విద్యారంగాన్ని ముందుకు‌తీసుక వెళ్లాలి

    - మంచి పాఠ్య ప్రణాళికతో విద్యా సంవత్సరం ప్రారంభిస్తాం.

    - గ్రాస్ ఎన్రోల్ మెంట్ రేషియో 90 శాతం కు సిఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.

    - వృత్తి విద్యా నైపుణ్యాభి వృద్ధి, ఉపాధి కల్పించే విధంగా డిగ్రీ నాలుగు ఏళ్లపాటు ఆనర్స్ కోర్సులు వుంటుంది.

    - బిటెక్ ఆనర్సు కోర్సు లు గా‌ రూపొందించాం.

    - ప్రకాశం, విజయనగరం లలో కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు.

    - ప్రకాశం జిల్లాలో టీచర్స్ ట్రైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు.

    - ఈ యూనివర్సిటీ ద్వారా టీచింగ్ లో కొత్త కోర్సులు తీసుకవస్తున్నాం

    - ప్రభుత్వ కాలేజిలను గత ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం చేశాయి.

    - జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో అనేక సంస్కరణ తెచ్చింది.

    - అక్టోబరు 15 లోగా కాలేజిలు ప్రారంభిస్తాం.

    - కామన్ ఎంట్రెన్స్ టెస్టులు సెప్టెంబరు మూడవ వారం నుండి ప్రారంభిస్తాం.

  • 6 Aug 2020 2:13 PM GMT

    అనపర్తి శాసనసభ్యుడు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటివ్..

    తూర్పుగోదావరి :

    - సెల్ఫీ వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే..

    - తన ఆరోగ్యంపై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కోరిన ఎమ్మెల్యే..

    - చికిత్స నిమిత్తం హైదరాబాద్ పయనమైన ఎమ్మెల్యే..

    -తన కార్యాలయంలో సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని వెల్లడించిన అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి..

  • 6 Aug 2020 12:41 PM GMT

    కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ వద్ద హై డ్రామా..

    శ్రీకాకుళం జిల్ల:

    - మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్లలోనే ఆత్మహత్యకు యత్నించిన మహిళ..

    - కేసు విషయంలో తన కుమారుడిని కోటబొమ్మాలి ఎస్.ఐ కొట్టారని మహిళ యర్రమ్మ ఆందోళన..

    - స్టేషన్ లొనే శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించిన యర్రమ్మ..

    - యర్రమ్మను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు..

  • 6 Aug 2020 12:36 PM GMT

    తిరుమలలో విషాదం..

    - శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకుడు కరోనాతో మృతి.

    - కొద్దీ రోజుల క్రిత్తమే గోవిందరాజుల స్వామి ఆలయం నుంచి డెప్యూటేషన్ పై తిరుమలకు వచ్చిన అర్చకుడు.

    - వారం క్రిత్తం కరోనా నిర్దారణ కావడంతో వైద్యం కోసం స్విమ్స్ కు తరలించిన టీటీడీ.

    - స్విమ్స్ లో చికిత్స పొందుతూ కాసేపటి క్రిత్తం మృతి చెందిన అర్చకుడు.

    - తోటి అర్చకుడు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో అర్చకులు.

    - అధికారికంగా దృవీకరించని టీటీడీ.

  • 6 Aug 2020 12:35 PM GMT

    అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు: ఎమ్మెల్యే పార్థసారథి

    అమరావతి:

    - అమరావతిలో ఆస్తులను కాపాడుకోవడానికి చంద్రబాబు తాపత్రయం పడుతున్నాడు..

    - తన ఎమ్మెల్యేలు పోయిన పర్వాలేదు తనకు అమరావతి ముఖ్యమనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు..

    - రాజధాని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది..

    - ఐదు వేల కోట్లు అమరావతి కోసం చంద్రబాబు ఖర్చు చేశారు..

    - 52 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారు..

    - కోర్టులను కూడా చంద్రబాబు మోసం చేస్తున్నారు..

    - చంద్రబాబు అమరావతి కోసం ఎక్కడ 52 వేల కోట్లు ఖర్చు చేశారో చెప్పాలి..

    - crdaను చంద్రబాబు రియల్ ఎస్టేట్ ఆదరిటీగా మార్చేశారు...

    - అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశాడు..

    - ఇష్టానుసారంగా రాజధానిలో తన బినామిలకు చంద్రబాబు భూములు ధారాదత్తం చేసాడు..

    - అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న వారు అంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు..

    - అమరావతి మీద ప్రేమతో కాదు వాళ్ళ వ్యాపారం కోసం ఉద్యమం చేయిస్తున్నారు..

    - అమరావతి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము..

    - పవన్ కళ్యాణ్ గుంటూరు కృష్ణ జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అజ్ఞాతివాసిగా మాట్లాడుతున్నారు..

    - మాకు అన్ని ప్రాంతాలు సమానాభివృద్దే ముఖ్యం..

    - రాజధాని రాష్ట్ర పరిధిలో ఉందని చెప్పిన టీడీపీ నేతలు బుద్ది లేకుండా ఇంకా కేంద్రం జోక్యం చేసుకోవాలని మాట్లాడుతున్నారు..

    - జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను కట్ కట్ చేసి ఎల్లో మీడియా చూపిస్తుంది..

    - రాజధానికి ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఉండాలని అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు..

    - చంద్రబాబు మతి భ్రమించి వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నారు..

    - గతంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్లారు..

    - కేసీఆర్ తెలంగాణ వాదం కోసం గతంలో ఉప ఎన్నికలకు వెళ్లారు..

    - అమరావతిపై చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్లాడనికి భయపడుతున్నారు..

  • 6 Aug 2020 12:31 PM GMT

    కడప :

    - కడప కేంద్ర కారాగారం వద్దకు చేరుకున్న జెసీ దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ కుమార్ రెడ్డి....

    - భారీగా చేరుకున్న అభిమానులు, టిడిపి శ్రేణులను...

    - కేంద్ర కారాగారం వద్దకు వచ్చిన అనుచరులు, అబిమానులను తరిమి వేసిన పొలీసులు

  • 6 Aug 2020 12:30 PM GMT

    అరకు ఏమ్మేల్యే శెట్టి పాల్గుణ కామెంట్స్

    విశాఖ జిల్లా:

    - తనకు కరోనా వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అది నిజం కాదని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ చెప్పారు

    - తన కుటుంబ సభ్యులకు కరోనా వచ్చి తగ్గిపోయిందని తాను వారిని కలవను కూడా లేదని పేర్కొన్నారు

    - కరోనాను తరిమి కొట్టడానికి అందరూ ముందుకు రావాలని కోరారు

    - రేపటి నుండి పది రోజుల పాటు అరకు స్వచ్చ లాక్ డౌన్ ప్రకటించటం జరిగిందని అందరూ సహకరించాలని కోరారు

  • 6 Aug 2020 12:27 PM GMT

    అమరావతి:

    - ప్రకాశం జిల్లాలో పేదలకు కేటాయించాలని నిర్ణయించిన 1367 ఎకరాల మైనింగ్ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటం లేదని కోర్టుకి తెలిపిన ఏపీ ప్రభుత్వం

    - మైనింగ్ కు అనుకూలంగా లేవని పిటిషనర్ తండ్రి అఫిడవిట్ ఇచ్చారన్న ప్రభుత్వం

    - అఫిడవిట్ అవాస్తవమని ప్రభుత్వ నిర్ణయం సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ

    - విచారణలో భాగంగా ఈ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని కోర్టుకి తెలిపిన ప్రభుత్వం

    - ఈ నెల 13కి తదుపరి విచారణ వాయిదా వేసిన హైకోర్టు

Print Article
Next Story
More Stories