Live Updates: ఈరోజు (05 అక్టోబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 05 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | తదియ ఉ.07-10 వరకు తదుపరి చవితి | భరణి నక్షత్రం మ.01-22 వరకు తదుపరి కృత్తిక | వర్జ్యం: రా.02-32 నుంచి 04-17 వరకు | అమృత ఘడియలు ఉ. 08-30 నుంచి 09-48 వరకు | దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 0900 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • AMARAVATHI : రాజధానిపై దాఖలైన పిటీషన్ ల పై విచారణ.
    5 Oct 2020 6:58 AM GMT

    AMARAVATHI : రాజధానిపై దాఖలైన పిటీషన్ ల పై విచారణ.

    అమరావతి: రాజధాని అంశంపై దాఖలైన పిటీషన్ ల పై విచారణ..

    - ఆన్ లైన్ ద్వారా విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు..

    - మొత్తం 226 పిటిషన్లు పెండింగులో ఉన్నాయన్న సీజే..

    - 44 పిటిషన్లను మొదట వింటామని చెప్పిన ధర్మాసనం..

    - 185 పిటిషన్లు పై తర్వాత విచారణ జరుపుతామని చెప్పిన ధర్మాసనం..

  • నూతన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి: చినరాజప్ప
    5 Oct 2020 6:54 AM GMT

    నూతన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి: చినరాజప్ప

    తూర్పుగోదావరి : పెద్దాపురం మం. కాండ్రకోట - తూర్పుపాకల గ్రామాల మధ్య కుప్పకూలిన వంతెనను పరిశీలించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప..

    - ఏలేరు వరదలు నీటిని దిగువకు విడుదల చేసే సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..

    - ఫలితంగా నీటి ప్రవాహానికి రోడ్లకు గండ్లు, వంతెన కుప్పకులాయి..

    - ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..

    - వెంటనే ఫేజ్ - 1, ఫేజ్ - 2 పనులకు నిధులు మంజూరు చేసి ఏలేరు ఆధునికీకరణ పనులు చేపట్టాలి..

    - రైతుల అవసరాలకు అనుగుణంగా కాండ్రకోట - తూర్పుపాకాల గ్రామాల మధ్య నూతన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి: చినరాజప్ప

  • CM JAGAN: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్
    5 Oct 2020 6:51 AM GMT

    CM JAGAN: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్

    కృష్ణాజిల్లా:  తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్

    - మరికాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుండి కడప బయలుదేరనున్న సీఎం జగన్

    -మామ గంగిరెడ్డి మూడవరోజు కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం జగన్

    - మధ్యాహ్నం 1గంటకు తిరిగి గన్నవరం చేరనున్న సీఎం జగన్

  • 5 Oct 2020 6:48 AM GMT

    స్విమ్స్ పద్మావతి ఆసుపత్రి ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం: జెసి వీరబ్రహ్మం,

    తిరుపతి: స్విమ్స్ పద్మావతి కోవిడ్ ఆసుపత్రి వద్ద దుర్ఘటనలో మృతి చెందిన రాధిక కుటుంబానికి 5లక్షల రూపాయల ఎక్సగ్రేషియా

    - గాయపడిన ఇద్దరికి చెరో 50వేల సాయంతో పాటు పూర్తి వైద్య ఖర్చులు

    - ఘటనకు బాధ్యలపై చర్యలు తీసుకుంటాం

    - ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించాం...

    - కేంద్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కేటాయించే 50లక్షల రూపాయల మంజూరుకు కూడా ప్రతిపాదనలు పంపుతాము

    - మృతురాకి భర్తకు పర్మినెంట్ ఉద్యోగానికి కూడా హామీ ఇచ్చిన జెసి వీరబ్రహ్మం, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ

Print Article
Next Story
More Stories