Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Live Updates:ఈరోజు (ఆగస్ట్-05) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 05 ఆగస్ట్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

ఈరోజు పంచాంగం

ఈరోజు బుధవారం, 05ఆగస్ట్, 2020 : శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం.. శ్రావణ మాసం, కృష్ణపక్షం విదియ(రాత్రి 9-34 వరకు) తదుపరి తదియ; ధనిష్ఠ నక్షత్రం (ఉ. 9-24 వరకు) తదుపరి శతభిష నక్షత్రం, అమృత ఘడియలు (తె. 3-20 నుంచి 5-02 వరకు), వర్జ్యం (సా. 5-04 నుంచి 6-47 వరకు) దుర్ముహూర్తం ( ఉ. 11-40 నుంచి 12-31 వరకు) రాహుకాలం (మ. 12-00 నుంచి 1-30 వరకు) సూర్యోదయం ఉ.5-43 సూర్యాస్తమయం సా.6-౨౯

జగదానంద కారకుడికి మందిర నిర్మాణం. ఎన్నో ఏళ్ల కల.. ఆ కల సాకారానికి తొలిఅడుగు మరి కొద్దిగంటల్లో పడనుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఆ వేడుకకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్ డేట్స్!

ఈరోజు తాజా వార్తలు

Show Full Article

Live Updates

  • 5 Aug 2020 12:29 PM GMT

    ఇచ్చాపురం 108 సిబ్బంది నిర్లక్ష్యం ఘటన పై స్పందించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్..

    శ్రీకాకుళం జిల్లా:

    - ఘటన పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం..

    - రెండు 108 వాహనాల సిబ్బంది మద్య తలెత్తిన వివాదం..

    - ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించకుండా గంటపాటు వాదులాడుకోవడం..

    - 108 వాహనం ఎక్కించకుండానే మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా పరిగణిస్తున్నామన్న కలెక్టర్ నివాస్..

    - సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఇచ్చాపురం తహశీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ నివాస్..

  • 5 Aug 2020 11:44 AM GMT

    మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రెస్ మీట్

    అనంతపురం :

    - మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రెస్ మీట్ 

    - వైద్య ఆరోగ్యశాఖ మీటింగ్ లో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వాస్తవాలు చెప్పడాన్ని అభినందిస్తున్నా.

    - అధికార పార్టీ ప్రజాప్రతిని చేసిన ఆరోపణ పై ప్రభుత్వం విచారణ జరపాలి.

    - కరోన విషయం లో అనంత వెంకటరామిరెడ్డి వాస్తవాలు చెప్పారు

    - ఆర్డీటీ సంస్థ అందిస్తోన్న సేవలు ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతోంది.

    - జిల్లా సమావేశంలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిన

    - వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి

    - సాధారణ ఆసుపత్రిని, కోవిడ్ ఆసుపత్రిని వేరు వేరు గా ఉంచాలి.

    - నిర్వహణ ప్రభుత్వం చేయలేకపోతే స్వచ్చంద సంస్థ ఆర్డీటీ కి జిజిహెచ్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలను అప్పగించండి.

  • 5 Aug 2020 11:43 AM GMT

    అన్ లాక్ 3.0 అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

    అమరావతి: 

    -  కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో అన్ లాక్ ప్రక్రియ

    - ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలకు అనుమతులు నిరాకరణ

    - సినిమా హాలు, స్విమ్మింగ్ పూల్స్, బార్ లు కు నో ఛాన్స్

    - తగిన జాగ్రత్తలతో యోగ ట్రైనింగ్ సెంటర్ లు, జిమ్ లకు నేటి నుండి అనుమతి

    - స్వతంత్రదినోత్సవ వేడుకలు భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాలని ఆదేశం

    - కంటోన్మెంట్ జోనుల్లో ఈ నెలలో 31 వరకు లాక్ డౌన్ కొనసాగింపు

  • 5 Aug 2020 11:42 AM GMT

    వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..

    - వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, పశ్చిమబెంగాల్ లమధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది....

    - దీనికి అనుబంధం గా 7.5కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది...

    - దీని ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ ,ఈశాన్య తెలంగాణ జిల్లాలో,ఉత్తర కోస్తా లో ఈరోజు ,రేపు ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    - రాగల మూడు రోజుల పాటు తెలంగాణ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    - ఉత్తర,దక్షిణ కోస్తాలో ఈరోజు ,రేపు ఒకటి రెండు చోట్లా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    - రాయలసీమ లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది...

    - ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    - హైదరాబాద్ లో తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్లా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది...

    - జూన్ 1 నుండి ఈరోజు వరకు నైరుతి రుతుపవనాలు కాలంలో తెలంగాణ లో సాధారణం కంటే 17 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది....

    - ఇందులో అత్యధికం వా జోగులంబ జిల్లాలో 121 శాతం ,వనపర్తి లో 117 శాతం సాధారణం కన్నా అత్యధికంగా నమోదైంది. అత్యల్పం నిర్మల్ జిల్లాలో సాధారణం కన్నా 20 శాతం తక్కువగా నమోదైనది..

    - కోస్తాంధ్ర లో సాధారణం కన్నా 29 శాతం ఎక్కువగా నమోదుకగా ఇందులో నెల్లూరు లో సాధారణం కన్నా 98 శాతం ఎక్కువగా నమోదయింది. శ్రీకాకుళం లో సాధారణ కన్నా 20 శాతం తక్కువగా నమోదైంది..

    - రాయలసీమ లో సాధారణం కన్నా 126 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఇందులో అత్యధికం గా అనంతపురం లో 158 శాతం సాధారణం కన్నా అధికంగా నమోదైంది...

  • 5 Aug 2020 11:41 AM GMT

    అమరావతి: 

    - రాష్ట్రంలో నదుల్లో కలుస్తున్నా కలుషిత నీటి శుద్ధి కోసం సివెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు

    - పురపాలక శాఖ కార్యదర్శి ని STP ఏర్పాటుకు నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

    - రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లి, శ్రీకాకుళం, కర్నూల్ మరియు నంద్యాల లోని ఐదు నదులలో కలుషిత నీరు చేరుతుందని గతంలో పేర్కొన్న సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

    - వచ్చే ఏడాది మార్చి 31 నాటికి 100 శాతం కలుషిత నీటిని శుద్ధి చేసే చర్యలు చేపట్టాలని ఆదేశం

    - కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా STP నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు

  • 5 Aug 2020 11:12 AM GMT

    కడప జిల్లాలొ ఒకరి పేరుతొ మరొకరు తప్పుడు అధార్, ఫోన్ నంబర్లతొ కరోనా టెస్ట్...

    కడప :

    - కడప జిల్లాలొ ఒకరి పేరుతొ మరొకరు తప్పుడు అధార్, ఫోన్ నంబర్లతొ కరోనా టెస్ట్...

    - ఫలితం వచ్చాకా కనిపించకుండా పొయిన టెస్ట్ చేయించుకున్న వ్యక్తి ...

    - వైద్యాధికారులు మాత్రం అధార్ అధారంగా మరొకరిని క్వారంటైన్ కు తరలింపు...

    - తీరా క్వారంటైన్ కు వెళ్లాకా టెస్ట్ చేస్తే అధార్ కార్డు వ్యక్తికి నెగెటీవ్...

    - అన్యాయంగా కరోనా లేకపొయినా... నేను కరొనా పరీక్ష చేయించుకొలేదని చెప్పినా వినిపించుకొకుండా క్వారంటైన్ తీసుకువచ్చారంటూ అవేదన

    - అదివారం మైదుకూరు మార్కెట్ యార్డులొ జి.కొట్టాలకు చెందిన జంపన గంగిరెడ్డి అనే వ్యక్తి పేరుతొ మరొకరొ కరోనా పరిక్షలు చేయించుకున్న గుర్తుకుతెలియని వ్యక్తి...

    - పాజిటీవ్ అని పరీక్షల్లొ రావడంతొ కనిపించకుండా పొయిన గుర్తుకు తెలియని వ్యక్తి...

    - వైద్యాధికారులు మాత్రం జంపన గంగిరెడ్డిని క్వారంటైన్ కు తరలింపు...

    - అధికారులకు తాను కరొనా పరీక్ష చేయించుకొలేదని చెప్పినా వినకిండా క్వారంటైన్ కు తరలించారని గంగిరెడ్డి అవేదన

  • 5 Aug 2020 11:10 AM GMT

    ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్

    విజయవాడ:

    - ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం

    - ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్

    - ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి

    - కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది

  • 5 Aug 2020 11:09 AM GMT

    అర్ ఎస్ ఎస్ చీఫ్

    - మోహన్ భగవత్ కి అయోధ్య లో ఏమి పని అని ప్రశ్నిస్తున్న సెక్యులర్ పార్టీలుగా చెప్పుకుంటున్న అయ పార్టీలు సిగ్గుతో తలదించూ కోవాలి..

    - కాశీ, మధుర లో ఎన్నో మసీదులు వున్నాయి..

    - వీటిని సైతం కూల్చి మోది సర్కార్ లోక్ స లో చట్టాలు రూపొందించి

    - ఆ ప్రాంతంలో హిందూ దేవాలయాలు రూపొందిస్తారు.

  • 5 Aug 2020 11:08 AM GMT

    బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా..

    శ్రీకాకుళం జిల్లా:

    - పలాస పోలీసు కార్యాలయంలో బాధితుడిని పరామర్శించిన ఎస్పీ అమిత్ బర్దార్..

    - ఘటనపై బాధితుడిని ఆరా తీసిన ఎస్పీ..

    - తనపై జరిగిన దాడికి బాధితుడిని క్షమాపణ కోరిన ఎస్పీ అమిత్ బర్దార్..

    - బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ భరోసా..

  • 5 Aug 2020 11:07 AM GMT

    రాష్ట్ర వైద్య శాఖ మంత్రి అళ్ల నాని కామెంట్స్ ...

    కడప :

    - జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సమీక్ష నిర్వహించాము..

    - నివారణకు తీసుకుంటున్న చర్యలు, జాగ్రత్తలు పై అధికారులతో సమీక్ష..

    - కోవిద్ హాస్పిటల్ లో ఏర్పాట్లు, భోజనాలు ఇతర స్యానిటేషన్ పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం...

    - ప్రతి రోజు జిల్లాలో 4500 కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం...

    - రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు...

    - పారదర్శకంగా వీలైనన్ని కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం...

    - కరోనా బాధితులను సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు వారి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ...

    - కరోనా రోగులకు అందిస్తున్న భోజన నాణ్యత లేకుంటే కఠిన చర్యలు తప్పవు...

    - నాణ్యత లేకుండా ఆహారాన్ని సరఫరా చేస్తే కాంట్రాక్ట్ రద్దుతో పాటు సంబంధిత అధికారులు పై చర్యలు...

    - దేశంలో నే అత్యధిక శాతం లో కరోనా టెస్టులు చేస్తున్నాం...

    - అందుకే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి...

    - కరోనా నివారణకు ఎంత ఖర్చు అయినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది...

    - జిల్లాలో ఇప్పటి వరకు 1080 బెడ్లు అందుబాటులో ఉన్నాయి... దీనికి అదనంగా300 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచడం జరిగింది..

    - నాన్ కోవిడ్ కేర్, కోవిద్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం..

    - 1000మంది నూతన వైద్య సిబ్బందిని వారం రోజుల లోపు తీసుకొనున్నాం...

    - స్టాఫ్ నర్సులు, నర్సులు, ఎఫ్ ఎన్ ఓ లను రిక్రూట్ చేస్తున్నాం..

    - కరోనా నివరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ప్రజలు కూడా సహకారాన్ని అందించాలి...

    - ప్లాస్మా దానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు...దీనిపై అపోహలు వద్దు...

    - ప్లాస్మా దానం ద్వారా అపాయాంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన వారు అవుతారు...

    - ప్లాస్మా దానం చేసిన వారికి ప్రోత్సహకంగా 5 వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది...

    - ఇది వరకు ఇచ్చిన సహకారాన్ని ప్రజలు కూడా కరోనా నివారణకు సహకరించాలి...

    - కరోనా పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది..

    - నెలకు 350 కోట్ల రూపాయలను కరోనా నివారణకు ఖర్చు చేస్తున్నాం...

    - ప్రజల ఆరోగ్యం కన్నా డబ్బులు ముఖ్యం కాదన్న సంకల్పంతో సిఎం వైఎస్ జగన్ ముందుకు వెళ్తున్నారు...

Print Article
Next Story
More Stories