Live Updates: ఈరోజు (03 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 03 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.
ఈరోజు పంచాంగం
ఈరోజు శనివారం | 03 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | విదియ: తె.05-06 వరకు తదుపరి తదియ | రేవతి ఉ.08-11 వరకు తదుపరి అశ్వని | వర్జ్యం: లేదు | అమృత ఘడియలు: రా.02-49 నుంచి 04-22 వరకు | దుర్ముహూర్తం: ఉ.05-54 నుంచి 07-29 వరకు | రాహుకాలం: ఉ.09-00 నుంచి 10-30 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-47
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 3 Oct 2020 10:49 AM IST
నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్ళకు అధికారుల కసరత్తు
ఈ నెల 7 నుంచి కొనుగోళ్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు.
జిల్లాలో 557 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు.
- 3 Oct 2020 10:48 AM IST
మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల పై రివ్యూ.
ఎన్నికలు జరిగే ఆరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్న సీఎం.
పట్టభద్రుల ఓటర్ నమోదు సీరియస్ గా తీసుకోవాలని అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకు సూచించనున్న సీఎం.
ఒక్కొక్క జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్న సీఎం కేసీఆర్.
గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదుల పై ఇప్పుటికె ప్రజలకు అవగహన కల్పిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు...
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి ఎవరు అనేది ఎమ్మెల్యే లకు సూచించనున్న సీఎం కేసీఆర్..
ప్రగతి భవన్ కు వచ్చే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మధ్యాహ్నం భోజనం కూడా ప్రగతి భవన్ లో ఏర్పాటు చేయాలని సిబ్బంది కి ఆదేశించినట్లు సమాచారం.
- 3 Oct 2020 10:48 AM IST
మధ్యాహ్నం ghmc ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ ఎన్నికల పై ఆల్ పార్టీ మీటింగ్.
ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధుల హాజరు.
గ్రేటర్ ఎన్నికల పై అన్ని పార్టీల అభిప్రాయం తీసుకోనున్న సీఎస్.
- 3 Oct 2020 10:47 AM IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
సరస్వతి బ్యారేజ్
10 గేట్లు ఎత్తిన అధికారులు
పూర్తి సామర్థ్యం 119.000 మీటర్లు
ప్రస్తుత సామర్థ్యం 117.500 మీటర్లు
పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీ
ప్రస్తుత సామర్థ్యం 7.58 టీఎంసీ
ఇన్ ఫ్లో 46,000 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో 20,000 క్యూసెక్కులు
- 3 Oct 2020 10:47 AM IST
హైదరాబాద్ నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద ఉన్న పురాతనమైన లింగంపల్లి మార్కెట్ కూల్చివేతను ప్రారంభించిన జిహెచ్ఎంసి అధికారులు.
మార్కెట్ శిథిలావస్థకు చేరడంతో... దానిని కూల్చివేసి , అదే స్థానంలో నూతన మార్కెట్ ను నిర్మించనున్న బల్దియా.
ఎన్నో ఏళ్లుగా తాము జీవనం సాగిస్తున్న మార్కెట్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ స్థలం చూపించాలంటూ ఆందోళనకు దిగిన వ్యాపారులు.
భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతను కొనసాగిస్తున్న అధికారులు.
- 3 Oct 2020 10:46 AM IST
నల్గొండ : పోలీసు అధికారుల పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ నేరాలకు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన ముఠాను అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు.... మధ్యాహ్నం మీడియా ముందుకు నిందితులు.
- 3 Oct 2020 10:45 AM IST
సిద్ధిపేట: ముంపు గ్రామమైన వేములఘాట్ ఏంపీటీసీ ఘణపురం కల్పన శనివారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో దుబ్బాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దత్తు తెలుపుతూ మంత్రి హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిక.



