మినరల్ వాటర్ తాగుతున్నారా?

మినరల్ వాటర్ తాగుతున్నారా?
x
Highlights

ఇప్పుడు చాలా మందికి నీటిని కొనుక్కొని తాగడం అలవాటు మారిపోయింది. దీంతో విపరీతంగా ఆర్వో ప్లాంట్ విస్తరించి నీటిని వ్యాపారంగా మర్చారు. అయితే ఆర్వో...

ఇప్పుడు చాలా మందికి నీటిని కొనుక్కొని తాగడం అలవాటు మారిపోయింది. దీంతో విపరీతంగా ఆర్వో ప్లాంట్ విస్తరించి నీటిని వ్యాపారంగా మర్చారు. అయితే ఆర్వో ప్లాంట్లలోని నీటిని తాగడం సురిక్షతం కాదంటున్నారు నిపుణులు. వాటిలో క్యాల్షియం, మెగ్నీషియం స్థాయిలు బాగా పడిపోతున్నట్లు తాజాగా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ఆ నీటిని తాగే వారిలో క్యాల్షియం కొరత ఏర్పడే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్యూరిఫైయింగ్ ద్వారా మినరల్స్ అన్నీ తొలగిపోతున్నాయి దీంతో ఆ నీటిని తీసుకోవడం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు.

మినరల్ వాటర్‌లో కృత్రిమమైన మినరల్స్ చేర్చడం ద్వారా అనారోగ్య ఇబ్బందులు తప్పవు. వాటిలో క్యాల్షియం, మెగ్నీషియం స్థాయులు తగ్గడంతో హృద్రోగ సంబంధిత వ్యాధులు, నరాల ఇబ్బందులు, గర్భస్థ శిశువులకు ఇబ్బందులు, క్యాన్సర్ కారకాలు ఏర్పడే అవకాశం వుందని వైద్యులు అంటున్నారు. ఒకవేళ ఫ్యూరిఫైయర్స్ వాటర్ వాడితే మినరలైజర్ ఆర్ టీడీఎస్ కంట్రోలర్ / మోడ్యులేటర్ ఫీచర్‌తో వున్నది కొనడం మంచిదంటున్నారు

తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్వో నీటిని తీసుకోవాల్సి వస్తే మెగ్నీషియం పుష్కలంగా వుండే ఆకుకూరలు, అరటి పండ్లు, రాస్‌బెర్రీ, నట్స్ కూరగాయలు తునా చేపలు కూడాన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే బ్రౌన్ రైస్ ఓట్స్, డార్క్ చాక్లెట్ మన డైట్'లో ఉండాలి. అలాగే క్యాల్షియంతో కూడిన ఆహారాన్ని కూడా డైట్‌లో భాగం చేసుకోవాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories