Salt Water: ఉప్పు నీటిలో పాదాలను 15 నిమిషాలు నానబెట్టండి – అద్భుత ఫలితాలు మీకే కనిపిస్తాయి

పాదాలలో వాపు, నొప్పి, పగుళ్లు వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. మృదువైన, ఆరోగ్యకరమైన పాదాలు కావాలంటే ఒక సులభమైన ఇంటి చిట్కా ప్రయత్నించండి – ఉప్పు నీటిలో పాదాలను పావుగంట పాటు నానబెట్టడం.

Ramya Vegirouthu
Published on: 24 July 2025 8:24 PM IST
Salt Water: ఉప్పు నీటిలో పాదాలను 15 నిమిషాలు నానబెట్టండి – అద్భుత ఫలితాలు మీకే కనిపిస్తాయి
X

పాదాలలో వాపు, నొప్పి, పగుళ్లు వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. మృదువైన, ఆరోగ్యకరమైన పాదాలు కావాలంటే ఒక సులభమైన ఇంటి చిట్కా ప్రయత్నించండి – ఉప్పు నీటిలో పాదాలను పావుగంట పాటు నానబెట్టడం. ఇలా ప్రతిరోజూ చేస్తే కాలి తిమ్మిర్లు, మడమల నొప్పి, పాదాల వాపు తగ్గిపోతాయి.

సాదా ఉప్పుతో చేసే చిట్కా

ఇంట్లో లభించే సాధారణ సముద్రపు ఉప్పును గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపండి. అందులో పాదాలను 15 నిమిషాల పాటు నానబెట్టండి.

అలసటతో వచ్చే పాదాల నొప్పి తగ్గుతుంది.

మెడ నొప్పి, తలనొప్పి తగ్గేందుకు కూడా ఇది సహాయపడుతుంది.

ఈ సమయంలో ఐస్ బ్యాగ్ను భుజంపై ఉంచితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

డెడ్ సీ సాల్ట్ ప్రయోజనాలు

డెడ్ సీ సాల్ట్లో సోడియం తక్కువగా, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని గోరువెచ్చని నీటిలో వేసి పాదాలను నానబెట్టడం వల్ల:

పగిలిన మడమలు మృదువుగా మారుతాయి.

మడమల నొప్పి తగ్గుతుంది.

పింక్ సాల్ట్ తో వెరికోస్ వెయిన్స్ తగ్గింపు

పింక్ సాల్ట్ను గోరువెచ్చని నీటిలో వేసి పాదాలను ప్రతిరోజు పావుగంట పాటు, మూడు వారాలు నానబెట్టండి.

వెరికోస్ వెయిన్స్ సమస్య తగ్గుతుంది.

పాదాల నొప్పులు కూడా తగ్గుతాయి.

ఈ సులభమైన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే పాదాల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా నొప్పులు, వాపులు కూడా తగ్గిపోతాయి.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story