Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో ఈ ఐటెమ్స్ ఉండాల్సిందే.. శుభఫలితాలకీ ఇవే కారణం!

ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 9న ఘనంగా జరుపుకోనున్నారు. అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా రాఖీ కట్టే ఈ సందర్భంగా, సోదరీమణులు తమ అన్నల శ్రేయస్సు, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు.

Ramya Vegirouthu
Updated on: 6 Aug 2025 6:45 PM IST
Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో ఈ ఐటెమ్స్ ఉండాల్సిందే.. శుభఫలితాలకీ ఇవే కారణం!
X

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో ఈ ఐటెమ్స్ ఉండాల్సిందే.. శుభఫలితాలకీ ఇవే కారణం!

ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 9న ఘనంగా జరుపుకోనున్నారు. అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి గుర్తుగా రాఖీ కట్టే ఈ సందర్భంగా, సోదరీమణులు తమ అన్నల శ్రేయస్సు, దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం పూజలు చేస్తారు. పండుగ వేళ రాఖీ ఉంచే పూజా పళ్లెం (థాలి)లో కొన్ని ముఖ్యమైన వస్తువులు తప్పకుండా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నమ్మకం.

ఇప్పుడు ఆ పళ్లెంలో ఏవేమి ఉండాలో చూద్దాం…

రాఖీ పళ్లెంలో ఉండవలసిన ముఖ్యమైన వస్తువులు:

1. కుంకుమ:

రాఖీ కట్టే ముందు అన్న నుదిటిపై తిలకం పెట్టే సంప్రదాయం ఉంది. దీని కోసం పళ్లెంలో కుంకుమ తప్పనిసరిగా ఉండాలి. ఇది శుభ సూచకంగా, ఆయుష్షు, శ్రేయస్సు, విజయానికి సంకేతంగా పరిగణించబడుతుంది.

2. అక్షతలు (ముడి బియ్యం):

తిలకం పెట్టిన తర్వాత నుదిటిపై అక్షతలు వేయడం అనేది ఒక శుభాచారం. అక్షతలు పవిత్రత, మంగళానికి సూచనగా భావిస్తారు.

3. దీపం:

ప్లేట్‌లో దీపం ఉండడం ఎంతో ముఖ్యమైనది. రాఖీ కట్టిన తర్వాత అన్నకి హారతి ఇవ్వడం చెడు దృష్టిని తొలగించి, జీవితంలో సానుకూల శక్తులు చేరేందుకు దోహదపడుతుంది.

4. స్వీట్లు:

రాఖీ అనంతరం అన్నకు మిఠాయిలు తినిపించడం సోదర సోదరీమణుల ప్రేమను మరింత బలోపేతం చేస్తుంది. అందుకే పళ్లెంలో తీపి పదార్థాలు కూడా ఉండాలి.

5. కొబ్బరికాయ (శ్రీఫలం):

శుభానికి చిహ్నంగా కొబ్బరికాయను పళ్లెంలో ఉంచుతారు. లక్ష్మీదేవి ప్రసాదంగా భావించే శ్రీఫలం అన్నకు శ్రేయస్సు, అభివృద్ధి తీసుకువస్తుందనే నమ్మకం ఉంది.

ఈ వస్తువులను రాఖీ పూజా ప్లేట్లో చేర్చడం ద్వారా పండుగ సాంప్రదాయపూర్వకంగా, శుభకరంగా కొనసాగుతుంది. పూజా విధానాన్ని సంపూర్ణంగా నిర్వహించడం వల్ల అన్నా-చెల్లెల్ల బంధం మరింత బలపడుతుంది.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story