రోజూ పెరుగు తినడం వల్ల...

రోజూ పెరుగు తినడం వల్ల...
x
Highlights

చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు...

చాలా మందికి చివరిలో పెరుగు కలుపుకుని తినకపోతే భోజనం చేసినట్టే ఉండదు. మరికొందరు దానివల్ల అనర్ధాలు ఉంటాయని మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు. నిజానికి పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినడం వల్ల ఎంతో మంచిదని అంటున్నారు నిపుణులు. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. శరీరానికి పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి అందుతాయి. రోజు పెరుగుతినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి..

రోజు పెరుగు తినవడం వల్ల రక్తప్రసవరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు అధ్యయనాలలో తేలింది. పెరుగులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియా శరీరంలోని బి మరియు టి వంటి తెల్ల రక్తకణాలను పెరిగేలా ఛేస్తుంది. పెరుగు శరీరానికి కావల్సిన విటమిన్ కె అందిస్తుంది.

పెరుగు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పొందవచ్చు. వాటిలోని విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, ఇతర మైక్రో మినిరల్స్ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా ఉండెలా చేస్తుంది. పెరుగులో ఉండే క్యాల్షియం ఫాస్పరస్ ఎముకలకు దంతాలను బలంగా ఉంచుతుంది. క్యాన్సర్ కణాలను అడ్డుకునే శక్తి పెరుగులో ఉంటుంది. దీన్ని ప్రతి రోజు తీసుకోవడం మంచిది. పెరుగును రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్స్‌, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories