అమ్మాయిలు ఎండు మిరపకాయ తింటే..!

అమ్మాయిలు ఎండు మిరపకాయ తింటే..!
x
Highlights

ఉరుకుల పరుగుల జీవితంలో ఆహార నియమాలూ పాటించడం చాల మందికి కుదరకపోవచ్చు. ఈ బిజీ లైఫ్‌లో సమయానికి ఆహారం తీసుకోవడం సాధ్యంకాని వారున్నారు. దీనివల్ల తరుచూ...

ఉరుకుల పరుగుల జీవితంలో ఆహార నియమాలూ పాటించడం చాల మందికి కుదరకపోవచ్చు. ఈ బిజీ లైఫ్‌లో సమయానికి ఆహారం తీసుకోవడం సాధ్యంకాని వారున్నారు. దీనివల్ల తరుచూ అనారోగ్యానికి గురికావల్సి ఉంటుంది. టైం కానీ టైంలో.. బయట ఫుడ్ ఎక్కువగా తింటుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తినే విషయంలో చాల జాగ్రత్తగా ఉంటారు. స్పైసీ పుడ్ తీసుకోవడానికి వాళ్లు ఇష్టపడరు. అయితే అమ్మాయిలు ఎండు మిరపకాయ తింటే బరువు తగ్గించుకోవచ్చట. అధిక బరువు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యూత్ చాలమందే ఉన్నారు. టీనేజ్ భామలు బరువు విషయంలో ఎక్కువగా భాదపడుతుంటారు. ఇలాంటి వారికి ఎండు మిరపకాయ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుందంటున్నారు నిపుణులు.

మహిళలు బరువు తగ్గాలనుకుంటున్న మార్గంలో వెళ్తున్నట్లయితే.. పండు మిర్చి చక్కటి చిట్కా అంటున్నారు నిపుణులు. పండు మిర‌ప‌కాయ‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు తగ్గించుకోవచ్చని అమెరికాలోని వెర్మోంట్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. 16వేల మందిపై వీరు పరిశోధనలు చేశారు. తరుచూ పండు మిరపకాయలు తినడం వల్ల బరుతు తగ్గుతారని నిర్ధారించారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీనిద్వారా మనిషి ఆయుష్షు కూడా పెరుగతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories