Good Nights Sleep : రాత్రి హాయిగా నిద్రపట్టాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత చిట్కా

మనిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మంచి నిద్ర మన మనస్సును ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.

CR Reddy
Published on: 27 Oct 2025 3:00 PM IST
Good Nights Sleep : రాత్రి హాయిగా నిద్రపట్టాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత చిట్కా
X

Good Nights Sleep : రాత్రి హాయిగా నిద్రపట్టాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఆయుర్వేదం చెప్పిన అద్భుత చిట్కా

Good Nights Sleep : మనిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. మంచి నిద్ర మన మనస్సును ఉత్సాహంగా ఉంచడమే కాకుండా, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అయితే, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, అలసట, శరీర నొప్పులు... ఈ కారణాల వల్ల చాలా మందికి రాత్రి కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టదు. మీకు కూడా రాత్రి సరిగా నిద్ర రావట్లేదా, అలసిపోతున్నారా? అయితే, రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి. ఖచ్చితంగా మీరు మంచి నిద్ర పొందుతారు.

పని ఒత్తిడి, అలసట వంటి కారణాల వల్ల చాలా మందికి సరిగా నిద్ర పట్టదు. మీకు కూడా ఈ సమస్య ఉంటే, రాత్రి పడుకునే ముందు పాదాలకు నూనెతో మసాజ్ చేయండి. ఈ పాదాభ్యంగ మీకు మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. శరీరానికి నూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పి, శరీర నొప్పి, తిమ్మిర్లు వంటి సమస్యలు తగ్గుతాయి కదా. అదేవిధంగా, పాదాలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రాత్రి బాగా నిద్ర వస్తుందట. అందుకోసం, రాత్రి పడుకునే ముందు ఆవనూనె లేదా నువ్వుల నూనెతో పాదాలకు మసాజ్ చేయండి. ఇది పురాతన ఆయుర్వేద సంప్రదాయం, ఇది నిమిషాల్లో శరీర నొప్పి, అలసటను తగ్గిస్తుంది. ఈ ఆయుర్వేద పద్ధతిని పాదాభ్యంగ అని పిలుస్తారు.

పాదాభ్యంగ శరీరంలోని నరాలను శాంతపరుస్తుంది. గాఢ నిద్రను ప్రేరేపిస్తుంది. పాదాల అడుగు భాగంలో దాదాపు 72,000 నరాలు ఉంటాయి. ఇవి గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, మెదడు వంటి వివిధ అవయవాలకు అనుసంధానించబడి ఉంటాయి. ఇలాంటి సందర్భంలో, ఈ భాగాలను నూనెతో మసాజ్ చేసినప్పుడు, శరీరంలోని అలసట దూరం అయ్యి, మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది డోపమైన్, సెరోటోనిన్ వంటి హార్మోన్లను సక్రియం చేస్తుంది. ఇది నిద్రను, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

పాదాలకు మసాజ్ చేయడానికి నువ్వుల నూనెను ఉత్తమంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది వాతాన్ని శాంతపరుస్తుంది, చర్మాన్ని పోషిస్తుంది. ఎముకలను బలపరుస్తుంది. ఆవనూనె కూడా మంచిది. ఈ ఆవనూనె జలుబు, జ్వరం నుండి శరీరాన్ని రక్షిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

రాత్రి సమయం మీ పాదాలకు మసాజ్ చేయడానికి మంచి సమయం, ఎందుకంటే పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేయడం వల్ల మీ అలసట తక్షణమే దూరమవుతుంది. ఇది మీకు గాఢ నిద్రను పొందడానికి సహాయపడుతుంది. ఇందుకోసం పడుకునే ముందు, మీ పాదాలను బాగా కడిగి, ఆపై వేడి చేసిన నువ్వుల నూనె లేదా ఆవనూనెను మీ పాదాల అడుగు భాగం, కాలి చీలమండలకు అప్లై చేసి 5 నుండి 10 నిమిషాల పాటు నెమ్మదిగా మసాజ్ చేయండి. ఆ తర్వాత సాక్స్ ధరించి నిద్రపోండి. ఇది శరీర ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

CR Reddy

CR Reddy

Next Story