అన్ని విషయాలు గవర్నర్‌ దృష్టికి : జగన్‌

అన్ని విషయాలు గవర్నర్‌ దృష్టికి : జగన్‌
x
Highlights

గవర్నర్ నరసింహన్‌తో వై.ఎస్. జగన్ భేటీ అయ్యారు. ఓటర్ల తొలగింపు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో జగన్ మాట్లాడుతూ,...

గవర్నర్ నరసింహన్‌తో వై.ఎస్. జగన్ భేటీ అయ్యారు. ఓటర్ల తొలగింపు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో జగన్ మాట్లాడుతూ, గవర్నర్ తో గంటకు పైగా భేటీ అయ్యామని, సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఢిల్లీలో ఈసీతో చెప్పిన విషయాలను గవర్నర్ కు వివరించినట్టు చెప్పారు. ప్రజాసాధికారత సర్వేల పేరుతో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని, పోలీసు పదోన్నతులను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ వెంట ధర్మా,న, విజయసాయి రెడ్డి, పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories