మరో ప్రాణాన్ని బలితీసుకున్న సెల్ఫీ సరదా

మరో ప్రాణాన్ని బలితీసుకున్న సెల్ఫీ సరదా
x
Highlights

సెల్ఫీ సరదా మరో ప్రాణాన్ని బలితీసుకుంది. గోవా బీచ్‌లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వైద్యురాలు ఊటుకూరు రమ్యకృష్ణ ప్రమాదవశాత్తు మృతిచెందింది....

సెల్ఫీ సరదా మరో ప్రాణాన్ని బలితీసుకుంది. గోవా బీచ్‌లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వైద్యురాలు ఊటుకూరు రమ్యకృష్ణ ప్రమాదవశాత్తు మృతిచెందింది. బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన కెరటాల్లో ఆమె కొట్టుకుపోయింది. నిన్న రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

గోవాలోని ప్రభుత్వ అనుబంధ వైద్య సంస్థలో వైద్యురాలిగా పనిచేస్తున్న రమ్యకృష్ణ గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా సముద్రపు అలలు ఉద్ధృతంగా వచ్చి ఆమె కొట్టుకుపోయింది. జగ్గయ్యపేట పట్టణంలోని మార్కండేయ బజార్‌కు చెందిన రమ్యకృష్ణకు తల్లి, సోదరులు, సోదరి ఉన్నారు. గతేడాది వరకు జగ్గయ్యపేట ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా పనిచేసిన రమ్యకృష్ణ 2018లో గోవాలో ఉద్యోగం రావడంతో అక్కడికివెళ్లారు. పట్టణంలో సుపరిచితురాలైన రమ్యకృష్ణ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది.


Show Full Article
Print Article
Next Story
More Stories