వేరేవాళ్లతో చనువుగా ఉందని.. యువతిపై కానిస్టేబుల్

వేరేవాళ్లతో చనువుగా ఉందని.. యువతిపై కానిస్టేబుల్
x
Highlights

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోనాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా ఓ కానిస్టేబులే యువతిపై పెట్రోల్ పోసి కాల్చి చంపడంతో కలకలం రేపుతోంది....

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోనాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా ఓ కానిస్టేబులే యువతిపై పెట్రోల్ పోసి కాల్చి చంపడంతో కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే హత్నూర పోలీస్‌ స్టేషన్‌కి ప్రకాశ్‌, రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌కి మందారిక బదిలీ అయ్యారు. అయినా కానీ వీరి మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. అయితే మందరిత వేరే వాళ్లతో చనువుగా ఉండటం గమనించిన ప్రకాష్ తట్టుకోలేపోయాడు. కోపం కట్టుతెచ్చుకున్నాడు. రోజురోజుకి మందరితపై అనుమానం పెంచుకున్న ప్రకాష్ ఎలాగైన మందరితను మట్టుపెట్టాలని పథకం పన్నాడు. పక్క ప్లాన్ ప్రకారం మందరితను నమ్మించి బయటకు తీసుకొచ్చి గొంతు నులిమి చంపాడు. తరువాత మృత దేహాన్ని కారులో సదాశివపేట మండలం కొనపూర్‌ గ్రాగ శివారుకు తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో ప్రకాశ్ పై కేసు నమోదు చేసి ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories