కన్నతల్లే కాలయముడు అయింది ..

కన్నతల్లే కాలయముడు అయింది ..
x
Highlights

అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను కన్న తల్లే అతి కిరాతకంగా చంపేసింది.. పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో పొడిచి అతి దారుణంగా కడతేర్చింది. ఈ...

అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను కన్న తల్లే అతి కిరాతకంగా చంపేసింది.. పిల్లల నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో పొడిచి అతి దారుణంగా కడతేర్చింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలోని గణేశ్‌నగర్‌ లో ఈ రోజు మధ్యాహ్నం చోటుచేసుకుంది.

అయితే స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితురాలు అప్పటికే అక్కడ నుంచి వెళ్లిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరోజ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి గణేశ్ నగర్‌లో నివాసం ఉంటోంది. శనివారం తన ఇద్దరు కుమారులు ఆర్యన్ (5), హర్షవర్ధన్ (2)ను నోట్లో గుడ్డలు కుక్కి బీరు సీసాతో దారుణంగా చంపేసింది.

ఇంతే కాకుండా స్థానికుల కధనం ప్రకారం భార్యాభర్తల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ గొడవల కారణంగానే సరోజ ఇంతటి దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పిల్లలను హత్య చేసిన అనంతరం తల్లి సరోజ కరీంనగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పిల్లల మృతదేహాలను చూసి తండ్రి రోదించడం.. స్థానికులను కంటతడి పెట్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories