జగన్ మెజారిటీ పై జోరుగా పందేలు ...

జగన్ మెజారిటీ పై జోరుగా పందేలు ...
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందులకి మంచి గుర్తింపు ఉంది . ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట అనే చెప్పాలి .. ప్రస్తుతం ఇక్కడినుండి వైసీపీ అధ్యక్షుడు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులివెందులకి మంచి గుర్తింపు ఉంది . ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట అనే చెప్పాలి .. ప్రస్తుతం ఇక్కడినుండి వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్ పోటి చేస్తున్నారు. గత ఎన్నికల నుండే అయన ఇక్కడినుండి పోటి దిగుతున్నారు ..ఆ ఎన్నికల్లో 75,243 అయన 75,243 ఓట్ల మెజార్టీతో మంచి విజయం సాధించారు .. ఆయన సమీప అభ్యర్థి టీడీపీ నుంచి బరిలో దిగిన సతీష్‌రెడ్డికి 49,333ఓట్లు వచ్చాయి...

అయితే ఇప్పుడు అయన ఎంత మెజారిటీతో విజయం సాధిస్తారు అన్న దానిపై ఆసక్తి నెలకొంది . పులివెందుల నియోజకవర్గం వైఎస్‌ కుటుంబానికి పెట్టిన కోటలా నిలిచింది. 40 సంవత్సరాలుగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ఆరంగేట్రం నుంచి ఇప్పటి వరకు ప్రతి అసెంబ్లీ ఎన్నికలోను గెలుస్తూ వస్తున్నారు ..

ఇప్పటికి సతీష్‌రెడ్డి నాలుగు దఫాలుగా వైఎస్‌ కుటుంబంపై పోటీపడుతూ వచ్చారు. 2019లో మరోసారి వైసీపీ నుంచి జగన్‌, టీడీపీ నుంచి 5 వ సారి సతీష్‌రెడ్డి పోటీ చేశారు... అయితే ఈ ఎన్నికల్లో జగన్ ని మెజారిటీతో గెలవకుండా చేయాలనీ టిడిపి సర్వశక్తులు ఒడ్డింది ..ఇప్పటికి జగన్ మెజారిటీ పై జోరుగా పందేలు కూడా సాగుతున్నాయి ..

Show Full Article
Print Article
Next Story
More Stories