త్రిసభ్య కమిటీ చేతిలో ప్రాథమిక ఆధారాలు

త్రిసభ్య కమిటీ చేతిలో ప్రాథమిక ఆధారాలు
x
Highlights

విశాఖ కిడ్నీ రాకెట్‌పై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ విచారణ ముమ్మరం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రద్ధ ఆసుపత్రిలో రెండో రోజు త్రిసభ్య కమిటీ విచారించింది....

విశాఖ కిడ్నీ రాకెట్‌పై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ విచారణ ముమ్మరం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రద్ధ ఆసుపత్రిలో రెండో రోజు త్రిసభ్య కమిటీ విచారించింది. ఆసుప్రతిలోని రికార్డులతో పాటు సిబ్బందిని కమిటీ సభ‌్యులు విచారించారు. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ల వివరాలు, కిడ్నిలు దానం చేసిన వ్యక్తుల చిరునామాలను పరిశీలించారు. వీటితో పాటు శ్రద్ధ ఆసుపత్రికి రెఫర్ చేసి వివిధ ఆసుపత్రుల వివరాలను కూడా సేకరించారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ కోణాల్లో సమాచారం సేకరిస్తున్నారు. దాంతో ఈ కేసులో ఆస్పత్రి యాజమాన్యంతో పాటు మరో డాక్టర్‌ని అదుపులోకి తీసుకునే వీలున్నట్లు తెలుస్తోంది.ఐదు పోలీసు బృందాలు ఈ కేసు విచారణలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories