వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు...జగన్‌కు సీఎం పీఠం యోగం ఉందన్న...

వైసీపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు...జగన్‌కు సీఎం పీఠం యోగం ఉందన్న...
x
Highlights

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ అధినేత జగన్ ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. జగన్‌కు...

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ అధినేత జగన్ ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. జగన్‌కు అధికార యోగం ఉందని సుస్థిర , సమర్థవంతం పాలన అందిస్తారంటూ పండితులు పంచాగం వినిపించారు. జగన్‌ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని పంచాగం చదివారు. అంతేకాదు రాష్ట్రంలో పటిష్టమైన ప్రతిపక్షం ఉండబోతోందనీ దానిని జగన్ సమర్ధంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా పండితులు చెప్పడం విశేషం. జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తారని తెలిపారు. ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్‌లో వర్షాలు సంమృద్ధిగా కురుస్తాయని కూడా జోస్యం చెప్పారు. ఏపీలో జగన్ ఆరోగ్యవంతమైన పాలన అందిస్తారని పండితులు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories