ఆ పార్టీకి ఓటు వేయలేదని భార్య నోట్లో యాసిడ్ పోసి..

ఆ పార్టీకి ఓటు వేయలేదని భార్య నోట్లో యాసిడ్ పోసి..
x
Highlights

దేశం సార్వత్రిక ఎన్నికలు కొన్ని చోట్ల ముసిగి, కొన్ని చోట్ల జరుగుతున్న విషయం తెలిసిందే కాగా ఈ ఎన్నికల నేపథ్యంలోనే పశ్చిమబెంగాలోని ముర్షిదాబాద్...

దేశం సార్వత్రిక ఎన్నికలు కొన్ని చోట్ల ముసిగి, కొన్ని చోట్ల జరుగుతున్న విషయం తెలిసిందే కాగా ఈ ఎన్నికల నేపథ్యంలోనే పశ్చిమబెంగాలోని ముర్షిదాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తృణ‌మూల్‌ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని ఆ పార్టీకి చెందిన కార్యకర్త కట్టుకున్నభార్య అని చూడకుండా చిత్రహింసలకు గురిచేసి, తన ఇష్టం వచ్చినట్లు చితకబాది చివరకు నోట్లో యాసిడ్ పోసి దారుణంగా ప్రవర్తించాడు. ఇక వివరాల్లోకి వెళితే అన్సురా బీ ఇటీవల పశ్చిమబెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో తన భర్త చెప్పిన పార్టీకి కాదని మరో పార్టీకే తన ఓటు వేసినట్లు తెలిపింది.

ఇక దీంతో పట్టరాని కోపంతో రగిలిపోయిన భర్త తన భార్యను రక్తం వచ్చేలా చావకొడుతూ ఏకంగా నోట్లో యాసిడ్ పోసాడు. దిన్ని గమనించిన స్థానికులు వెంటనే అన్సురా బీని హుటాహుటానా దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న ఆమెపై యాసిడ్ పోయడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. యాసిడ్ తాలూకు రసాయనాన్ని ఆమె శరీరం నుంచి తొలగించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఇక నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories