టిక్‌టాక్ సెలబ్రిటీ దారుణ హత్య

టిక్‌టాక్ సెలబ్రిటీ దారుణ హత్య
x
Highlights

టిక్ టాక్ లో క్రియేటివ్‌గా వీడియోలు తీసి సెలబ్రెటీగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన దేశరాజధాని దిల్లీలో...

టిక్ టాక్ లో క్రియేటివ్‌గా వీడియోలు తీసి సెలబ్రెటీగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ ఘటన దేశరాజధాని దిల్లీలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే మోహిత్‌ మోర్‌(24) అనే టిక్‌టాక్‌ సెలబ్రిటీను ముగ్గురు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. టిక్‌టాక్‌లో మోహిత్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మోహిత్‌ మోర్ నజఫ్‌గఢ్‌ ప్రాంతంలో మోహిత్‌ ఓ ఫొటో స్టూడియోకు వెళ్లాడు షాపు ముందున్న సోఫాలో కూర్చుని ఉండగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మోహిత్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. కాగా ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. ఆ దుండగుల్లో ఇద్దరు వాళ్ల ముఖాలు కనపడకుండా హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తపడ్డారు. మరో వ్యక్తి ముఖం మాత్రం ఫుటేజ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. డబ్బు విషయంలో జరిగిన గొడవ కారణంగానే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హత్యకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మోహిత్‌ శరీరంలో 13 బుల్లెట్లు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే మోహిత్‌కు ఈ దుండగులకు ఎమైనా గొడవలున్నాయా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories