దొడ్డిదారిలో టీఆర్‌‌ఎస్ అధికారంలోకి వచ్చింది

దొడ్డిదారిలో టీఆర్‌‌ఎస్ అధికారంలోకి వచ్చింది
x
Highlights

ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసినా ఫలితం లేకుండా పోయిందని...

ఈవీఎంలలో అక్రమాలకు పాల్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ కు ఓటేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. మోడీ, కేసీఆర్ కుమ్మక్కయ్యారని డీకే అరుణ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ధోరణిలో టీఆర్ఎస్ ఉందన్నారు. అసాధ్యం అనుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని, అలాంటి కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ కేంద్రంలో బీజేపీకి టీఆర్ఎస్ వత్తాసు పలుకుతోందని అలాంటిది ఇప్పుడు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామంటూ మోసపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. విభజన హామీలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని డీకే అరుణ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories