రోహిణి కార్తె లో రొళ్లు పగులుతాయి అనే సామెత నిజమయ్యేలా భానుడి ప్రతాపం కనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం నుంచి...
రోహిణి కార్తె లో రొళ్లు పగులుతాయి అనే సామెత నిజమయ్యేలా భానుడి ప్రతాపం కనిపిస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భానుడు భగభగ మండిపోతున్నాడు. పలు జిల్లాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఇక వారం రోజులుగా భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడుతున్నారు. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువడంతో ఉదయం 7 గంటల నుండి ఎండ తీవ్రత పెరగడంతో కూలీలు పనులకు వెళ్లడం లేదు. నగరాల్లో సైతం ఉద్యోగాలకు ఉదయం వెళ్ళాలి అంటే జంకుతున్నారు.
శనివారం ఆదిలాబాద్లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర, తూర్పు తెలంగాణలో 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీలు.. పశ్చిమ, దక్షిణ తెలంగాణలో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్లో రోడ్లన్నీ కర్ఫ్యూ మాదిరి నిర్మానుష్యంగా మారుతున్నాయి.రానున్న నాలుగురోజులు తెలంగాణలో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని... దీంతో ఉష్ణోగ్రత 47 డిగ్రీలు, ఆపైన నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈనెల 28 వరకు వడగాల్పుల తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. అటు ఆంద్రప్రదేశ్ లోనూ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. మే 27 నుంచి జూన్ 2 వరకు ఎండల తీవ్రత అధికం కానుంది. రాయలసీమ, దక్షిణ కోస్తాతో పలు ప్రాంతాల్లో సగటున 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.ఎండల ధాటికి వన్యప్రాణులు తట్టుకోలేకపోతున్నాయి. భానుడి భగభగకు మృత్యువాత పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ శివారులో తాగు నీరు లేక నెమళ్లు సొమ్మసిల్లి పడిపోతున్నాయి. దాహార్తి తాళలేక నాలుగు నెమళ్లు మృతి చెందాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire