సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు విచారణలో షాకింగ్ న్యూస్

సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసు విచారణలో షాకింగ్ న్యూస్
x
Highlights

శ్రీనివాస్‌రెడ్డి ఆ పేరు వింటే చాలు హాజీపూర్‌ వణికిపోయింది. మనిషన్న వాడు రగిలిపోయాడు. వరుస హత్యలతో సంచలనం సృష్టించాడు హాజీపూర్‌ నిందితుడు...

శ్రీనివాస్‌రెడ్డి ఆ పేరు వింటే చాలు హాజీపూర్‌ వణికిపోయింది. మనిషన్న వాడు రగిలిపోయాడు. వరుస హత్యలతో సంచలనం సృష్టించాడు హాజీపూర్‌ నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి. అభంశుభం తెలియని ముగ్గురు బాలికలపై అత్యాచారంచేసి ఆపై హత్య చేశాడు సైకో కిల్లర్ హాజీపూర్ శ్రీనివాస్‌‌‌రెడ్డి. సైకో శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తన నేర చరితపై లోతుగా విచారిస్తున్నారు. కాగా విచారణలో మామిడి తోటల్లో పని చూపిస్తానని వరంగల్‌ నుంచి ఓ జంటను శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చినట్టు తెలిసింది. అయితే గత కొంత కాలంగా లిఫ్ట్‌ మెకానిక్‌ పనిలో సాయం తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఆ తరువాతి నుంచి ఆ దంపతులు కనిపించలేదని పోలీసులకు గ్రామస్థులు తెలిపారు. గ్రామస్థుల అనుమానాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కస్టడీలో ఉన్న శ్రీనివాసరెడ్డి నుంచి కూడా కీలక సమాచారం రాబడుతున్నట్లు సమాచారం. కాగా సైకో శ్రీనివాస్ రెడ్డి ఫోన్‌లో మొత్తం అశ్లీల వెబ్‌సైట్ల సెర్చింగ్‌లే ఎక్కువ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories