భీమవరంలో దారుణం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి..

భీమవరంలో దారుణం.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి..
x
Highlights

అమరావతి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. నర్సాపురం (మం) ఎల్బీచర్ల సర్కారు దవాఖానలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాంబాబు ఓ...

అమరావతి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. నర్సాపురం (మం) ఎల్బీచర్ల సర్కారు దవాఖానలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాంబాబు ఓ యువతిని తరుచూ బ్లాక్ మెయిల్, బెదిరింపులకు గురిచేస్తూ అత్యాచారానికి పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే కొద్దిరోజులక్రితం రాంబాబుకు తెలిసినవారి ఇంటికి యువతిని తీసుకవెళ్లి ఇంట్లో కూర్చోబెట్టాడు ఆ తరువాత కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చిడు. ఆ మత్తుకు మెళ్లీగా నిద్రలోకి జారుకుంది. ఇక రాంబాబు ఆ యువతిపై అత్యాచారం చేశాడు. అయితే అత్యాచారం చేసిన రాంబాబు అదంతా సెల్ పోన్‌లో బంధించాడు.

ఇక అప్పటి నుండి ఆ యువతిని తరుచూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ యువతికి నరకం చూపిస్తున్నాడు. ఇక దీంతో రాంబాబు వేదింపులకు తాళలేక యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇక యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న యువతి బంధువులు రాంబాబును పొట్టుపొట్టు కొట్టి పోలీసులకు అప్పగించారు. ఇన్నిరోజులుగా తనను వేధింపులకు గురిచేసిన రాంబాబును కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరింది. అలాగే తనకు న్యాయం చేయాలని వేడుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories